ETV Bharat / bharat

మదురై 'చిథిరై' ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 16, 2022, 10:18 AM IST

Updated : Apr 16, 2022, 12:01 PM IST

Kallazhagar Vaigai river festival
చిథిరై ఉత్సవాలు

Stampede in Tamil Nadu: మదురైలో నిర్వహిస్తున్న చిథిరై ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​.

Stampede in Tamil Nadu: తమిళనాడు, మదురైలోని చిథిరై ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. శ్రీ కల్లాళగర్​ సుందరరాజా పెరుమాళ్ స్వామి ఊరేగింపునకు భారీగా జనం తరలిరాగా.. తొక్కిసలాట జరిగింది. ఓ 90 ఏళ్ల వృద్ధుడు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kallazhagar Vaigai river festival
ఊరేగింపులో భారీగా జనం

భారత ప్రఖ్యాత ఉత్సవాల్లో చిథిరై పండుగ ఒకటి. ఈ ఉత్సవాలు ఏప్రిల్​ 5న మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్వామి కల్లాళగర్​ సుందరరాజా పెరుమాళ్​ను బంగారు గుర్రంపై ఊరేగింపుగా వైగాయి నదికి తీసుకెళ్లారు. ఈ శనివారం ఉదయం నదిలో నిమజ్జనం చేశారు. ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. స్వామి వారి ఊరేగింపులో ఒక్కసారిగా జనం పరుగులు పెట్టటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

రూ.5 లక్షల పరిహరం: తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరికి తలో రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలతో బయటపడిన మరో ఏడుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గజరాజుల పరుగు పందెం.. భారీగా తరలివచ్చిన జనం

Last Updated :Apr 16, 2022, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.