ETV Bharat / bharat

అనుమానాస్పద రీతిలో ఆరుగురు మృతి.. కారణం అదేనా?

author img

By

Published : Jan 27, 2022, 2:33 PM IST

Spurious Liquor Bihar
అనుమానాస్పద రీతిలో ఆరుగురు మృతి

Spurious Liquor Bihar: బిహార్​లోని బక్సర్​లో ఆరుగురు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. అయితే కల్తీ మద్యమే వారి మరణానికి కారణమై ఉండొచ్చని బాధిత కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

Spurious Liquor Bihar: బిహార్​లోని బక్సర్​లో ఆరుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటన బుధవారం జరిగింది. కల్తీ మద్యం తాగడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మద్యంపానంపై నిషేధం విధించినా కూడా వారికి మద్యం ఎలా లభించిందని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

2016 ఏప్రిల్​ నుంచి బిహార్​లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : తగ్గిన రాహుల్​ ట్విట్టర్​ ఫాలోవర్స్​! కేంద్రం ఒత్తిడి వల్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.