ETV Bharat / bharat

కరోనా టీకా తీసుకోకపోతే క్రిమినల్​ కేసు.. కలెక్టర్ కఠిన ఆదేశాలు

author img

By

Published : Nov 12, 2021, 2:15 PM IST

Singrauli collector gave strict order over corona vaccine jibe said FIR will be done if both doses of corona vaccine are not taken
కరోనా టీకా తీసుకోకపోతే క్రిమినల్​ కేసు- కలెక్టర్ కఠిన ఆదేశాలు

కరోనా టీకా తీసుకోని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు ఓ జిల్లా కలెక్టర్. డిసెంబర్​ 15 వరకు ప్రజలకు డెడ్​లైన్ విధించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు.

కరోనా టీకా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు మధ్యప్రదేశ్​ సింగ్​రౌలీ జిల్లా కలెక్టర్​ రాజీవ్ రంజన్ మీనా. డిసెంబర్ 15 నాటికి టీకా రెండు డోసులు తీసుకోవాలని ప్రజలను కరాఖండీగా చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా బహిరంగ సమావేశాలు, ఫంక్షన్లు, హోటళ్లు, ప్రైవేట్ సంస్థలకు వెళ్లే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.

Singrauli collector gave strict order over corona vaccine jibe said FIR will be done if both doses of corona vaccine are not taken
టీకా తీసుకోకపోతే క్రిమినల్​ కేసు- కలెక్టర్ కఠిన ఆదేశాలు

డిసెంబర్​ 15 తర్వాత కరోనా టీకా తీసుకోని వారిని ప్రెవేటు సంస్థలు, హెటళ్లు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశాల్లో ఉంది. టీకా తీసుకోకుండా అందరూ గుమికూడితే వైరస్​కు కేంద్రబిందువుగా మారే ప్రమాదముందని అందులో హెచ్చరించారు. అందుకే ప్రజలంతా రెండు డోసులు టీకా తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. టీకా తీసుకోని వారిపై సెక్షన్​ 144(1), మధ్యప్రదేశ్ ప్రజారోగ్య చట్టం 1949లోని సెక్షన్ 71(1), 71(2) కింద కేసు నమోదు చెయనున్నన్నట్లు పేర్కొన్నారు. అయితే వైద్య కారణాల కారణంగా టీకా తీసుకోలేని వారికి మాత్రం మినహాయింపునిచ్చారు.

రేషన్​ కార్డు ఉన్నవాళ్ల కుటుంబసభ్యులు కచ్చితంగా రెండు డోసుల టీకాల తీసుకోవాలని మధ్యప్రదేశ్​ ఆహార, పౌర సరఫరా శాఖ ఇప్పటికే తేల్చిచెప్పింది.18 ఏళ్లు పైబడి టీకా తీసుకోని వారి వివరాలను ఆరోగ్య శాఖకు అందజేయాలని అధికారులను ఆదేశించింది.

అందుకే కఠిన ఆదేశాలు..

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, టీకాతోనే మహమ్మారిని నిర్మూలించవచ్చని తెలిపారు కలెక్టర్ రాజీవ్ రంజన్​. ప్రజలంతా కచ్చితంగా టీకాలు తీసుకోవాలని, ప్రభుత్వం పెద్దఎత్తున వ్యాక్సిన్ డ్రైవ్​లను నిర్వహిస్తోందని వివరించారు. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండొద్దన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారుల్లో కొంతమంది టీకా తీసుకోవడం లేదన్న వార్తల నడుమ నవంబర్ 10న కఠిన ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్​ రాజీవ్. అవసరమైతే టీకా తీసుకోని ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని, సర్వీసు నుంచి బదిలీ చేయాలని హెచ్చరించారు.

టీకాలపై నవంబర్ 17న విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్​లో నిర్లక్ష్యంగా వ్యవహరించే నోడల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: 'లఖింపుర్​' కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్​లైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.