ETV Bharat / bharat

వారి కోసం స్వయంగా వంట చేసిన సీఎం- రాత్రికి సూపర్ విందు!

author img

By

Published : Sep 8, 2021, 2:56 PM IST

Updated : Sep 9, 2021, 11:13 AM IST

punjab cm
సీఎం అమరీందర్​ సింగ్​

సీఎం అమరీందర్ సింగ్​ షెఫ్​లా మారారు. ఇచ్చిన మాట కోసం ఒలింపిక్​ విజేతలకు బుధవారం సాయంత్రం స్వయంగా వండి పెట్టారు.

నీరజ్ చోప్రాతో సహా టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన హరియాణా అథ్లెట్లకు సీఎం అమరీందర్​ సింగ్​ బుధవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఇందుకు స్వయంగా ఆయనే షెఫ్​లా మారారు.

.
.

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన హరియాణా అథ్లెట్లకు స్వయంగా తానే వండి పెడతానని గతంలో హామీ ఇచ్చారు అమరీందర్. అందుకు అనుగుణంగా మొహాలీలోని సీఎం ఫామ్​హౌస్​లో విందు ఏర్పాటు చేశారు.

'పులావ్, మటన్​, చికెన్, ఆలూ, బిర్యానీతో సహా అనేక రుచికరమైన పాటియాలా వంటకాలను సీఎం అమరీందర్​ స్వయంగా తయారు చేశారు. ఒలింపిక్ పతక విజేతలకు విందు ఏర్పాటు చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోనున్నారు' అని సీఎం అమరీందర్​ సలహాదారు రవీన్ తుక్రాల్ తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా తిరుగులేని విజయం సాధించి భారత్​కు స్వర్ణాన్ని అందించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

.
.
.
.

ఇదీ చదవండి:రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత

భవానీపుర్​లో మమత ఎన్నిక లాంఛనమేనా?

Last Updated :Sep 9, 2021, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.