ETV Bharat / bharat

రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత

author img

By

Published : Sep 7, 2021, 6:30 PM IST

farmers protest
రైతులు

హరియాణా కర్నాల్​లో రైతులు తలపెట్టిన మహాపంచాయత్​కు వేలాది మంది హాజరయ్యారు. కర్నాల్​లో ఇటీవల జరిగన లాఠీఛార్జ్​లో ఎందరో రైతులు గాయపడ్డారని, సంబంధిత అధికారులను సస్పెండ్​ చేయాలని నేతలు డిమాండ్​ చేశారు. ఇదే విషయంపై స్థానిక అధికారులతో చర్చలు జరిగాయి. అవి విఫలమైన కారణంగా కర్నాల్​లోని మినీ సెక్రటేరియట్​ను ముట్టడించేందుకు రైతులు తరలివెళ్లారు.

హరియాణా కర్నాల్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నాల్​ మినీ సెక్రటేరియట్​ను చుట్టుముట్టేందుకు వేలాది మంది రైతులు జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులను భారీస్థాయిలో మోహరించారు అధికారులు.

లాఠీఛార్జ్​కు నిరసనగా..

ఆగస్టు 28న కర్నాల్​ ప్రాంతంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు అప్పటి నుంచి డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం న్యూ అనాజ్​ మండీ వద్ద మహాపంచాయత్​ నిర్వహించగా.. సభకు పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ నుంచి వేలాది మంది రైతులు తరలివెళ్లారు.

karnal
కర్నాల్​ వీధుల్లో

లాఠీఛార్జ్​కు ఆదేశాలిచ్చిన ఐఏఎస్​ అధికారిని సస్పెండ్​ చేయాలన్నదే తమ డిమాండ్​ అని బీకేయూ నేత రాకేశ్​ టికాయత్​ స్పష్టం చేశారు.

karnal
నిరసనల్లో పాల్గొన్న రాకేశ్​ టికాయత్​

ఈ నేపథ్యంలో 11 మంది సభ్యుల బృందాన్ని పిలిపించి వారి డిమాండ్లపై చర్చించింది స్థానిక యంత్రాంగం. అయినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల సచివాలయం ముట్టడికి రైతులు దూసుకెళ్లారు.

నిరసనలు శాంతియుతంగా సాగాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, పోలీసులతో గొడవకు దిగొద్దని స్పష్ట చేశారు.

karnal
భారీ బందోబస్తు

ఇదీ చూడండి:- Farmers protest: అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.