ETV Bharat / bharat

ఐసోలేషన్​లో ప్రియాంకా గాంధీ.. ప్రచారాలపై ఎఫెక్ట్​!

author img

By

Published : Jan 3, 2022, 9:03 PM IST

Jitan Ram Manjhi Mahendra Nath Pandey Covid positive
ప్రియాంకా గాంధీ జీతన్ రామ్ మాంఝీ కరోనా

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండగా.. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, భాజపా ఎంపీ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ సోకింది. మరోవైపు, ప్రియాంకా గాంధీ ఐసోలేషన్​కు వెళ్లారు.

Priyanka Gandhi self isolation: కాంగ్రెస్​ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ఐసోలేషన్​లోకి వెళ్లారు. తన సిబ్బందిలో ఒకరితో పాటు ఓ కుటుంబసభ్యుడికి కరోనా సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రియాంకకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్​గా వచ్చింది.

జనవరి 9న ఉత్తరాఖండ్​లోని అల్మోరాలో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్​కు వెళ్లిన నేపథ్యంలో.. సభ నిర్వహణపై ప్రభావం పడే అవకాశాముంది! ఈ విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది పార్టీ యంత్రాంగం. జనవరి 4న సమావేశమై దీనిపై చర్చించనుంది.

మాజీ సీఎంకు కొవిడ్

Manjhi Covid positive మరోవైపు, బిహార్​కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలిద్దరు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర మాజీ సీఎం జీతన్​రామ్ మాంఝీ, భాజపా ఎంపీ డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ పాజిటివ్​గా తేలింది.

మాంఝీతో పాటు ఆయన కుటుంబంలో మరో 18 మందికీ కరోనా నిర్ధరణ అయింది. వీరంతా తమ స్వగ్రామమైన మహాకర్​లో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మాంఝీ పార్టీ అయిన హిందుస్థాన్ ఆవమ్ మోర్చా ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు.

Mahendra Nath Pandey Covid

మరోవైపు, మహేంద్ర నాథ్ పాండే.. గాజియాబాద్​లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను ఎమర్జెన్సీ యూనిట్​కు తరలించారు. కరోనా సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్​- ఐసిస్​తో లింకులే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.