ETV Bharat / bharat

Parliament winter session: పార్లమెంట్​లో భాజపా ఎంపీల నిరసనలు

author img

By

Published : Dec 3, 2021, 10:59 AM IST

Updated : Dec 3, 2021, 3:08 PM IST

parliament winter session
ఐదో రోజుకు చేరిన పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

15:06 December 03

లోక్​సభ ముందుకు రెండు కీలక బిల్లులు

సీబీఐ, ఈడీ డైరక్టర్​ల పదవీకాలాన్ని పెంచడం కోసం రూపొందించిన సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​ చట్ట సవరణ బిల్లు, దిల్లీ స్పెషల్​ పోలీస్​ ఎస్టాబ్లిష్​మెంట్​ చట్ట సవరణ బిల్లు.. లోక్​సభ ముందు వచ్చాయి. డైరక్టర్​ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచుతూ ఇటీవలే ఆర్డినెన్స్​ జారీ చేసింది కేంద్రం.

బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష నేతలను తీవ్రంగా హింసించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందమని మండిపడ్డాయి.

విపక్షాల వైఖరిని మాత్రం కేంద్రం తప్పుబడుతోంది. డైరక్టర్​ల పదవీకాలంపై గతంలో ఎటువంటి నిబంధనలు లేవని.. ఇప్పుడు తాము గరిష్ఠంగా ఐదేళ్లు అని చెబుతున్నామని పేర్కొంది.

11:26 December 03

భాజపా నిరసన

  • #WATCH | Delhi: BJP Rajya Sabha MPs protest against the protesting Opposition over the suspension of 12 Rajya Sabha MPs for the winter Parliament, near the Gandhi statue pic.twitter.com/zngQpt1guj

    — ANI (@ANI) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంట్​లో విపక్షాల వైఖరి పట్ల భాజపా ఎంపీలు నిరసన చేపట్టారు. వారికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు.

12మంది ఎంపీల సస్పెన్షన్​కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా విపక్ష ఎంపీలు నిరసన చేస్తున్నాయి. ఎంపీలపై ఉన్న సస్పెన్షన్​ను తొలగించాలని డిమాండ్​ చేస్తున్నాయి. ఈ కారణంగా ఉభయసభలు కొన్ని గంటల పాటు సజావుగా సాగలేదు. ముఖ్యంగా రాజ్యసభకు నిరసన సెగ తగిలి.. పలు మార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో విపక్షాల వైఖరిపై భాజపా ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు.

10:26 December 03

ఐదో రోజుకు పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరాయి. 2021 సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్ చట్ట​ సవరణ బిల్లు, 2021 దిల్లీ స్పెషల్​ పోలీస్​ ఎస్టాబ్లిష్​మెంట్​ చట్ట సవరణ బిల్లు.. లోక్​సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే ప్రవేశపెట్టిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన చట్ట సవరణ బిల్లుపై ఇవాళ చర్చ జరగనుంది.

నాలుగో రోజు.. దేశంలో కరోనా పరిస్థితులపై లోక్​సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వంపై విపక్షాలు పలు కీలక ప్రశ్నలు సంధించాయి. వాటికి ప్రభుత్వం సమాధానాలిచ్చింది. అటు రాజ్యసభలో.. డ్యామ్​ సేఫ్టీ బిల్లు ఆమోదం పొందింది.

విపక్షాల నిరసన..

పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభలో 12 మంది సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Last Updated :Dec 3, 2021, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.