ETV Bharat / bharat

శుక్రవారం వరకే రాజ్యసభ బడ్జెట్​ సమావేశాలు!

author img

By

Published : Feb 11, 2021, 9:38 AM IST

Updated : Feb 11, 2021, 1:39 PM IST

Rajyasabha
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

12:09 February 11

శుక్రవారం వరకే రాజ్యసభ బడ్జెట్​ సమావేశాలు!

రాజ్యసభ బడ్జెట్​ సమావేశాల తొలిభాగం ఓ రోజు ముందుగానే ముగిసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 13వ తేదీ కాకుండా.. 12వ తేదీనేే ముగించేందుకు బిజినెస్​ అడ్వైజరీ కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించాయి.  

10:40 February 11

ఎల్​ఏసీ వెంబడి శాంతికి కట్టుబడి ఉన్నాం: రాజ్​నాథ్​

  • We are committed to maintaining a peaceful situation at the Line of Control. India has always emphasised on maintaining bilateral ties: Defence Minister Rajnath Singh makes a statement on ‘present situation in Eastern Ladakh’ in Rajya Sabha pic.twitter.com/qIdzYgo2aC

    — ANI (@ANI) February 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో తూర్పు లద్ధాఖ్​లోని ప్రస్తుత పరిస్థితులపై రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 

" వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాం. ధ్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని భారత్​ నొక్కిచెబుతోంది. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మన భద్రతా దళాలు నిరూపించాయి. " అని పేర్కొన్నారు రాజ్​నాథ్​

పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు రాజ్​నాథ్​. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత.. భారత్​-చైనాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని తెలిపారు.  తూర్పు లద్ధాఖ్​లో ఎల్​ఏసీ వెంబడి  చైనా భారీగా బలగాలను మోహరించిందని... అందుకు దీటుగా మన బలగాలనూ మోహరించామని చెప్పారు.  

09:28 February 11

'లద్ధాఖ్​'పై రాజ్యసభలో రక్షణ మంత్రి ప్రకటన!

  • #WATCH | Delhi: Defence Minister Rajnath Singh arrives at the Parliament.

    He will make a statement on ‘present situation in Eastern Ladakh’ in Rajya Sabha at 10:30 am today. pic.twitter.com/hyXn9iyD0w

    — ANI (@ANI) February 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో తూర్పు లద్ధాఖ్​లో ప్రస్తుత పరిస్థితులపై రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. లద్ధాఖ్​పై ఉదయం 10.30 గంటలకు మాట్లాడనున్నారు.

సచిన్​, లతా మంగేష్కర్​ వంటి ప్రముఖుల ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టే అంశంపై చర్చించాలని కోరుతూ.. రాజ్యసభలో శున్య గంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ భగవత్​ కరద్​. ప్రముఖుల ట్వీట్లపై దర్యాప్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర అంశాలపై ముందుగా చర్చించాలని కోరారు.  

Last Updated :Feb 11, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.