ETV Bharat / bharat

COVID: దేశంలో మరో 50వేల కరోనా కేసులు

author img

By

Published : Jun 27, 2021, 9:49 AM IST

Updated : Jun 27, 2021, 11:01 AM IST

COVID CASES
కరోనా కేసులు

దేశంలో కొత్తగా 50,040 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్​ బారిన పడి మరో 1,258 మంది మరణించారు. శనివారం 64 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో కొవిడ్ ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 50,040 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ధాటికి మరో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు: 3,02,33,183
  • యాక్టివ్ కేసులు: 5,86,403
  • కోలుకున్నవారు: 57,944
  • మొత్తం మరణాలు: 3,95,751

40 కోట్ల పరీక్షలు..

దేశవ్యాప్తంగా శనివారం 17,77,309 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 403,589,201‬కు చేరినట్లు చెప్పింది.

వ్యాక్సినేషన్​​..

ఒక్కరోజే 64,25,893 వ్యాక్సిన్​ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 32,17,60,077కు చేరినట్లు స్పష్టం చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

Last Updated :Jun 27, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.