ETV Bharat / bharat

కదులుతున్న బస్సులో సడెన్​గా మంటలు- 9మంది సజీవ దహనం- మరో 24మందికి గాయాలు - Bus Fire Accident

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 7:15 AM IST

Updated : May 18, 2024, 8:48 AM IST

Bus Fire Accident In Haryana : హరియాణాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 18మంది గాయపడ్డారు.

Bus Fire Accident In Haryana
Bus Fire Accident In Haryana (ETV Bharat)

Bus Fire Accident In Haryana : హరియాణాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 9మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి నుహ్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, పంజాబ్ చండీగఢ్​కు చెందిన 60మంది మధుర, బృందావన్​ను సందర్శించేందుకు ఓ టూరిస్ట్​ బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నుహ్​ జిల్లా తావడు పట్టణ సమీపంలోని కుండలీ మానేసర్ పల్వాల్​ ఎక్స్​ప్రెస్​వే వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే ఇంకా మృతులు గుర్తించలేదని పేర్కొన్నారు.

'డ్రైవర్ పట్టించుకోలేదు'
డ్రైవర్​ కూడా మంటలను గమనించలేదని స్థానికులు చెబుతున్నారు. 'అర్థరాత్రి 1:30 గంటల సమయంలో బస్సు వెనుక భాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను చూసిన స్థానికులు బస్సు ఆపాలని కేకలు వేశారు. డ్రైవర్ గమనించుకోకుండా వెళ్తున్నాడు. దీంతో ఓ యువకుడు బైక్​పై బస్సును వెంబడించి ఆపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. కానీ కొంతమంది బస్సులో కాలిపోయారు' అని స్థానికులు తెలిపారు.

ట్రాక్టర్​ను ఢీకొన్న బస్సు - నలుగురు మృతి
Bus Accident In Karnataka : కర్ణాటకలో ట్రాక్టర్​ను బస్సు ఢీకొనడం వల్ల నలుగురు మృతి చెందారు. మరో 18మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొప్పల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బస్సులో సుమారు 30మంది వరకు ఉన్నారు. వారంతా కరముడి గ్రామానికి చెందిన వారు. కొప్పల్​లో ఉన్న హులిగెమ్మదేవి ఆలయాని వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హోసలింగాపుర సమీపంలోని 50వ జాతీయ రహదారిపై రాగానే ముందున్న ట్రాక్టర్​ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కొత్త ఎంపీలకు గ్రాండ్​ వెల్​కమ్​- పార్లమెంటులో ముమ్మర ఏర్పాట్లు- రిజల్ట్స్​ రోజే వచ్చే ఛాన్స్​! - Lok Sabha Elections 2024

'48 గంటల్లో పోలింగ్‌ శాతాలు వెల్లడించాలి!' ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు - Lok Sabha Elections 2024

Last Updated : May 18, 2024, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.