ETV Bharat / bharat

Navjot Singh Sidhu: రైతు ఆందోళనలపై సీఎంకు సిద్ధూ లేఖ

author img

By

Published : Sep 13, 2021, 5:59 AM IST

మాజీ క్రికెటర్​, పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ రైతు సమస్యలపై గళమెత్తారు. రైతు డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సొంత పార్టీ సీఎంకే లేఖ రాయడం విశేషం. రైతుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు. రైతుల ఆందోళనలో భాగంగా వారిపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను రద్దు చేయాలని.. వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆ లేఖలో కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వొద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 32 వ్యవసాయ సంఘాల ప్రతినిధులను కలిసిన రెండు రోజులకు సిద్ధూ ఈ లేఖ రాయడం గమనార్హం.

"వ్యవసాయ చట్టాల రద్దు కోసం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో రైతులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్యాయమైనవి. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాల తరఫున సీఎంను డిమాండ్ చేస్తున్నా."

-నవజోత్ సింగ్ సిద్ధూ

'ప్రైవేట్ మార్కెట్‌ల కోసమే వివిధ నిబంధనల పేరుతో 'వన్ నేషన్-టూ మార్కెట్లను కేంద్రం రూపొందిస్తోందని' సిద్ధూ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలపై పోరులో ప్రతి దశలోనూ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రైతులకు సిద్ధూ భరోసానిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.