ETV Bharat / bharat

సీఎంపై మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాటు

author img

By

Published : Aug 24, 2021, 7:34 PM IST

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్(amarinder singh news)​పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. తమకిచ్చిన హామీలను కెప్టెన్​ నెరవేర్చలేదని ఆరోపించారు. కెప్టెన్​ను సీఎం పదవి నుంచి తప్పించాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. త్వరలో సోనియాను కలుస్తామని చెప్పారు.

Captain Amarinder Singh
అమరీందర్​ సింగ్​

పంజాబ్​ కాంగ్రెస్​(punjab congress)లో లుకలుకలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి.. పంజాబ్​ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​పై కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వీరికి పలువురు మంత్రులు కూడా తోడవ్వడం గమనార్హం.

మంత్రి రాజిందర్ సింగ్ భజ్వా నివాసంలో సుఖ్​బిందర్​ సింగ్ సర్కారియా, సుఖ్​జిందర్​ సింగ్​ రంధ్వారా, చరణ్​జిత్​ సింగ్​ ఛన్నితో పాటు 20 మందికిపైగా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 2017 ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీలను కెప్టెన్​(amarinder singh news) నెరవేర్చలేదని వారందరూ ఆరోపించారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించేందుకు ఆమెను కలవాలని భేటీలో సభ్యులు నిర్ణయించారు. ఊహించని రీతిలో చర్యలు చేపడితేనే రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు మెరుగుపడుతాయని పేర్కొన్న భజ్వా.. అవసరమైతే సీఎంను కూడా తప్పించాలని తేల్చిచెప్పారు. కెప్టెన్​ను తప్పించాలన్నది తమ ఒక్కరి డిమాండ్​ కాదని.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని తెలిపారు.

కశ్మీర్​ ప్రత్యేక దేశమంటూ నవ​జ్యోత్​సింగ్​ సిద్ధూ(navjot singh sidhu congress news) సలహాదారుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ఇప్పటికే​ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని తప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్​ చేస్తుండటం అధికార పక్షాన్ని మరింత క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేస్తోంది.

117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్​లో​.. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్​కు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇదీ చూడండి:- పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.