ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న నవీన్​ మృతదేహం.. ప్రధానికి బొమ్మై కృతజ్ఞతలు

author img

By

Published : Mar 21, 2022, 4:33 AM IST

naveen body ukraine
basavaraj bommai

Naveen Body Ukraine: ఉక్రెయిన్​లో రష్యా యుద్ధం కారణంగా చనిపోయిన భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్​ మృతదేహం.. సోమవారం తెల్లవారుజామున బెంగళూరు చేరుకుంది. నవీన్ పార్థివదేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై నివాళులు అర్పించారు.

Naveen Body Ukraine: రష్యా యుద్ధంతో ఉక్రెయిన్​లో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్​ శేఖరప్ప మృతదేహం సోమవారం తెల్లవారుజామున బెంగళూరు చేరుకుంది. నవీన్​ పార్థివదేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై నివాళులు అర్పించారు.

naveen body ukraine
భారత్​కు చేరుకున్న నవీన్​ మృతదేహం

ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ చదువుతున్న నవీన్​.. ఖార్కీవ్‌ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో మార్చి 1న​ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని ఎస్​ఎస్​ మెడికల్​ కాలేజీకి దానం చేయాలని నవీన్ కుటుంబం నిర్ణయించింది.

naveen body ukraine
నవీన్ పార్థివదేహానికి​ బొమ్మై నివాళులు

అంతకుముందు నవీన్ మృతదేహాన్ని భారత్​కు రప్పించడంలో చేసిన కృషికి గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బొమ్మై. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

basavaraj bommai
ప్రధానికి బొమ్మై లేఖ

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​ నుంచి ఆదివారమే రావాల్సింది.. అలా చెప్పి అంతలోనే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.