ETV Bharat / bharat

10 నుంచి 25 వేలకు జన్ ఔషధి కేంద్రాల పెంపు- ఇకపై మరింత చౌకగా మందులు!

author img

By PTI

Published : Nov 30, 2023, 1:57 PM IST

Updated : Nov 30, 2023, 3:41 PM IST

Jan Aushadhi Kendras Number Increased By PM Modi
Jan Aushadhi Kendras Number Increased

Narendra Modi Jan Aushadhi Kendras : సబ్సిడీ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దీంతో సాధారణ ప్రజలకు మరింత చౌకధరలకే మందులు లభిస్తాయని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో జన్​ ఔషధి కేంద్రాల ద్వారా మందులు కొనుగోలు చేసే 'వికసిత్ భారత్​ సంకల్ప్​ యాత్ర' లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ముచ్చటించారు.

Narendra Modi Jan Aushadhi Kendras : సబ్సిడీ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దీంతో సాధారణ ప్రజలకు మరింత చౌకధరలకే మందులు లభిస్తాయని మోదీ అన్నారు. ఇదే కార్యక్రమంలో.. 'వికసిత్ భారత్​ సంకల్ప్​ యాత్ర' లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ముచ్చటించారు.

లబ్ధిదారులందరికీ ఈ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ పథకాలు పరిపూర్ణతను సాధిస్తాయని.. ఈ లక్ష్యంతోనే భారత్ సంకల్ప్​ యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఝార్ఖండ్​లోని దేవ్‌గఢ్​ ఎయిమ్స్​లో ప్రారంభించిన ​10,000వ జన్​ ఔషధి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

  • #WATCH | PM Modi takes part in a program to interact with beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing

    The PM will launch a program to increase the number of Jan Aushadi Kendras from 10,000 to 25,000. He will also launch Pradhan Mantri Mahila Kisan… pic.twitter.com/8q9mqQZ8FB

    — ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'డ్రోన్ దీదీ యోజన' ప్రారంభం..!
మరోవైపు వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు డ్రోన్‌లు అద్దెకు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 'డ్రోన్ దీదీ యోజన'ను కూడా గురువారం ప్రారంభించారు మోదీ. ఇందుకోసం 15,000 మహిళా స్వయం సహాయక బృందాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 2024-25 నుంచి 2025-26 మధ్య కాలంలో వీరికి డ్రోన్​లను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రధాని అన్నారు.

గత 10 ఏళ్లుగా..
గత 10 ఏళ్లుగా తాను ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న మంచి పనిని చూసి ప్రజలు తమ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'వికసిత్ భారత్​ సంకల్ప్​ యాత్ర' లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంభాషించిన అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రభుత్వాలు తమను తాము పౌరుల 'మై-బాప్(నియంతగా)'గా భావించాయని.. ఓటు బ్యాంకును మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశాయని ప్రతిపక్ష పార్టీలపై ఫైర్​ అయ్యారు ప్రధాని మోదీ. 'నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలు అంటే పేదలు, యువత, మహిళలు, రైతులు.. వీరి ఎదుగుదలే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది' అని మోదీ అన్నారు.

"గత 10 ఏళ్లుగా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారు. దీంతో వారిలో మా సర్కార్​పై అపారమైన విశ్వాసం పెరిగింది. మునుపటి ప్రభుత్వాలు తమను తాము 'మై బాప్​(తామే గొప్ప)'గా భావించాయి. ఈ కారణంతోనే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా జనాభాలో సింహ భాగం ప్రజలు కనీస సౌకర్యాలకు దూరమయ్యారు."
- ప్రధాని నరేంద్ర మోదీ

'మోదీకి గ్యారెంటీ వాలీ గాడీ'..!
'వికసిత్​ భారత్​ సంకల్ప యాత్ర'లో కేవలం 15 రోజుల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారని మోదీ అన్నారు. ప్రజలు ఇప్పుడు యాత్రలోని 'రథాలను' 'మోదీకి గ్యారెంటీ వాలీ గాడీ(రథం)'గా గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 'మోదీకి గ్యారెంటీ' వాహనం 12 వేల పంచాయతీలకు చేరుకుందని.. దీని ద్వారా 30 లక్షల మందికిపైగా లబ్ధి పొందారని ప్రధాని చెప్పారు.

  • #WATCH | Foreign Secretary Vinay Kwatra says, "PM will also be participating in another high-level event which is titled "Transforming Climate Finance" which is to be hosted by the presidency of COP28 - the UAE." pic.twitter.com/1WR2O6jZLW

    — ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దుబాయ్​కు మోదీ..!
PM Modi Dubai Visit : యూఏఈ అధ్యక్షత వహిస్తున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌తో పాటు మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం దుబాయ్​ వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్​ క్వాత్రా తెలిపారు. 'ట్రాన్స్‌ఫార్మింగ్ క్లైమేట్ ఫైనాన్స్​పై COP28లో స్పష్టమైన రోడ్‌మ్యాప్​కు అంగీకారం లభిస్తుందని మేము ఆశిస్తున్నాము' అని ఆయన పేర్కొన్నారు.

  • #WATCH | Foreign Secretary Vinay Kwatra says, "The second side event co-hosted by India and Sweden is the launch of LeadIT 2.0, essentially a leadership group for energy transition. This was a joint initiative launched by India and Sweden in 2019 at the UN Climate Action Summit… pic.twitter.com/CZPHTcdOjH

    — ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంస్కృతంలోనే మాటామంతీ- తొలి గ్రామంగా రికార్డు- ఎక్కడో తెలుసా?

పల్లెటూరి మేడమ్​-ఇంగ్లీష్ పాఠాలు, యూట్యూబ్​లో నెలకు రూ.లక్షల్లో ఆదాయం​!

Last Updated :Nov 30, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.