ETV Bharat / bharat

పొరపాటున పాక్​లోకి వెళ్లిన వ్యక్తి- ఎన్ని జైళ్లలో పెట్టారంటే..

author img

By

Published : Aug 31, 2021, 8:57 PM IST

Pakistani jail
పాకిస్థాన్

23 ఏళ్ల క్రితం భారత్​ నుంచి తప్పిపోయిన ఓ వ్యక్తి ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నాడు. గతంలో అనుకోకుండా పాకిస్థాన్​ భూభాగంలోకి అడుగుపెట్టిన అతడిని ఆ దేశ అధికారులు అరెస్టు చేశారు. వివిధ జైళ్లలో (Pakistani jail) బంధించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రెండు దశాబ్దాల క్రితం తప్పిపోయి.. పాకిస్థాన్​లో జైలు శిక్ష (Pakistani jail) అనుభవించిన ఓ వ్యక్తి తిరిగి భారత్​ చేరుకున్నాడు. వాఘా సరిహద్దు వద్ద అతడిని సరిహద్దు భద్రతా దళాని(బీఎస్​ఎఫ్​)కి సోమవారం అప్పగించారు పాక్ అధికారులు. మధ్యప్రదేశ్​కు చెందిన అతడు.. మంగళవారం సాయంత్రానికల్లా స్వగ్రామానికి చేరుకుంటాడని పోలీసులు తెలిపారు.

Pakistani jail
భారత్-పాకిస్థాన్ సరిహద్దు

ఏం జరిగిందంటే?

సాగర్​ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ సింగ్ రాజ్​పుత్ (57) 23 ఏళ్ల కిందట కనిపించకుండాపోయారు. అనుకోకుండా సరిహద్దులు దాటి పాకిస్థాన్​లోకి ప్రవేశించాడు. "దీంతో అతడిని అరెస్టు చేసి పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని జైల్లో బంధించారు. అనంతరం రావల్పిండి జైలుకు తరలించారు. పాక్​లో అతడు ఎంత కాలం జైలు జీవితం గడిపింది స్పష్టంగా తెలియాల్సి ఉంది" అని సాగర్​ జిల్లా ఎస్​పీ అతుల్ సింగ్ తెలిపారు.

2015లోనే అతడి గురించి..

్ప్రహ్లాద్ సింగ్

మానసిక రుగ్మతలతో తమ జైళ్లలో ఉన్న 17 మంది గురించి పాక్ అధికారులు భారత్​కు 2015లో సమాచారమిచ్చినట్లు అతుల్ వెల్లడించారు. "ప్లహ్లాద్​ పేరు కూడా అందులో ఉంది. కానీ ఆ సమయంలో అతడిని గుర్తించడానికి వీలుపడలేదు. ఈ వ్యవహారంపై గతేడాది సాగర్​ ఎస్పీ కార్యలయంలో అతడి సోదరుడు దరఖాస్తు పెట్టారు. దాని ఆధారంగా ప్రహ్లాద్​ ఆచూకీ ధ్రువీకరించాం" అని ఎస్​పీ వివరించారు.

మరో ఇద్దరికీ విముక్తి..

అక్రమంగా సరిహద్దులు దాటినందుకు 8ఏళ్లుగా పాక్ జైళ్లలో మగ్గుతున్న మరో ఇద్దరు వ్యక్తులకూ విముక్తి లభించింది. భారత పౌరులు శర్మ రాజ్​పుత్, రామ్ బుహదార్​లను మంగళవారం వాఘా బోర్డర్ వద్ద బీఎస్​ఎఫ్​కు అప్పగించింది పాక్. 2013లో ఎల్​ఓసీ దాటిన వారిని అరెస్టు చేసిన పాక్ రేంజర్లు ఇద్దరికీ మతిస్థిమితం లేదని గుర్తించి వదిలేశారు.

2019లోనూ

2019లోనూ మధ్యప్రదేశ్​లోని దామోహ్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అనుకోకుండా పాకిస్థాన్​ సరిహద్దు దాటి, ఈ ఏడాది జూన్​లో స్వగ్రామానికి చేరుకున్నాడు.

ఇంకా తేలలేదు..

అయితే గతేడాది అక్రమంగా సరిహద్దు దాటారనే కారణాలపై అరెస్ట్ అయిన 19 మంది భారత పౌరులు ఇప్పటికీ పాక్​లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారం ఫెడరల్ రివ్యూ బోర్డు వద్ద పెండింగ్​లో ఉంది.

ఇదీ చూడండి: Afghanistan Taliban:'తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.