ETV Bharat / bharat

Modi US visit 2021: అత్యున్నత భేటీలు.. కీలక చర్చలు...

author img

By

Published : Sep 21, 2021, 5:35 PM IST

modi us tour
మోదీ అమెరికా టూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం అమెరికాకు పయనం (Modi US visit 2021) కానున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో సమావేశం కానున్నారు. క్వాడ్ సదస్సుతో పాటు, ఐక్యరాజ్య సమితి (Modi UNGA 2021) సమావేశంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 26న తిరిగి భారత్​కు వస్తారు మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు (Modi US visit 2021) సర్వం సిద్ధమైంది. మోదీ బుధవారం అమెరికాకు పయనం కానున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అవుతారు. (Modi US trip 2021) రక్షణ, భద్రత, వ్యాపార, పెట్టుబడుల అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. ఇతర ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు సైతం వీరి మధ్య చర్చకు రానున్నాయి. అదే విధంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తోనూ మోదీ సమావేశం కానున్నారు. కమల, మోదీ మధ్య జరిగే తొలి అధికారిక సమావేశం ఇదే కానుండటం విశేషం.

పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సైతం అమెరికా (Modi US trip 2021) వెళ్లనున్నారు.

కొవిడ్ సదస్సు..

అమెరికా అధ్యక్షుడు బుధవారం నిర్వహించే కొవిడ్ అంతర్జాతీయ సదస్సులో (Covid Global Summit) ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి శ్రింగ్లా తెలిపారు. మోదీ-బైడెన్ (Modi US trip 2021) ఉగ్రవాద కట్టడి అంశంపై ప్రధానంగా చర్చిస్తారని తెలిపారు. అఫ్గానిస్థాన్ పరిణామాలు సహా ప్రాంతీయ అంశాలపైనా మాట్లాడుకుంటారని చెప్పారు. దీంతో పాటు... సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత, మానవతా సహాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులు, విద్య, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరపనున్నట్లు వివరించారు.

క్వాడ్

సెప్టెంబర్ 24న జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ ప్రత్యక్షంగా హాజరవుతారని (Modi Quad Summit) శ్రింగ్లా వివరించారు. సమకాలీన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై క్వాడ్ సదస్సులో చర్చించనున్నారని చెప్పారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విజన్​పై అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం విలువైన అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఐరాస సమావేశంలో..

వాషింగ్టన్​లో అమెరికా సంస్థలకు చెందిన ఎగ్జిక్యూటివ్​లతో మోదీ సమావేశమవుతారని శ్రింగ్లా స్పష్టం చేశారు. ఆ తర్వాత మోదీ.. న్యూయార్క్​కు బయల్దేరుతారు. సెప్టెంబర్ 25న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(Modi UNGA 2021) 76వ సమావేశంలో ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 26న తిరిగి భారత్​కు వస్తారు.

2019 సెప్టెంబర్​లో చివరిసారి అమెరికాలో పర్యటించారు మోదీ. ఈ పర్యటనలోనే హౌడీ-మోదీ కార్యక్రమం జరిగింది.

ఆకస్ కూటమిపై విలేకరి ప్రశ్న

మరోవైపు, యూకే, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి ఏర్పాటు చేసుకున్న 'ఆకస్' కూటమి వల్ల క్వాడ్​పై పడే ప్రభావం గురించి విలేకరులు శ్రింగ్లాను ప్రశ్నించారు. అయితే, ఈ అనుమానాలను తోసిపుచ్చిన ఆయన.. రెండు కూటములు ఒకటి కాదని అని బదులిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.