ETV Bharat / international

Modi US visit: 'మోదీ- బైడెన్​ భేటీతో బంధం మరింత బలోపేతం'

author img

By

Published : Sep 21, 2021, 7:24 AM IST

modi-biden meet
మోదీ-బైడెన్​ భేటీ

మోదీ-బైడెన్​ మధ్య ఈ నెల 24న జరగనున్న భేటీతో ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి మరింత బలపడుతుందని శ్వేతసౌధం(white house america) ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది క్వాడ్​ బృందానికి కూడా ఉపయోగకరమని పేర్కొంది. మరోవైపు మోదీతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ భేటీ ఖరారైంది. ఈ నెల 23న వీరి మధ్య సమావేశం జరగనుంది(modi us trip).

అమెరికా పర్యటనలో భాగంగా(modi us visit).. దేశాధ్యక్షుడు జో బైడెన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న భేటీ కానున్నారు. తాజాగా.. వీరి సమావేశంపై శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది(modi us trip). అగ్రనేతల భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేసింది(modi us visit 2021). అదే సమయంలో క్వాడ్​ బృందాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది.

"ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలపై ఏడు దేశాబ్దాలుగా ఇరు దేశాల మైత్రి ముడిపడి ఉంది. వీటిని బలోపేతం చేసే దిశగా అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. స్వేచ్ఛాయుత ఇండో-పెసిఫిక్​, కరొనా మహమ్మారిపై పోరాటంలో పాల్గొని భారత్​తో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంది బైడెన్​ ప్రభుత్వం. ఇదే కొనసాగాలని ఆశిస్తోంది."

-- శ్వేతసౌధం.

ఉగ్రవాద నిరోధక చర్యలపైనా ఇరు నేతలు చర్చించనున్నట్టు అగ్రరాజ్య అధికారి మీడియాకు వెల్లడించారు. వివిధ ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలు భేటీలో ప్రస్తావనకు వస్తాయన్నారు.

24న.. అగ్రనేతల మధ్య సమావేశం జరగనుంది. అనంతరం బైడెన్​ అధ్యక్షతన క్వాడ్​ భేటీకానుంది. ఇందులో మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​, జపాన్​ ప్రధాని యోషిహిదే సుగా పాల్గొననున్నారు(quad countries summit). క్వాడ్‌ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు.

మోదీ-బైడెన్​ ఇప్పటివరకు అనేక మార్లు ఫోన్​ సంభాషణలు జరిగాయి. కానీ బైడెన్​ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కలవడం ఇదే తొలిసారి కానుంది. ఈ నేపథ్యంలో చర్చలు కేవలం ప్రభుత్వ అంశాలకే పరిమితం కాకుండా.. ఇరు దేశాలను మరింత చేరువచేసే విధంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

హ్యారిస్​తో భేటీ...

అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్​తోనూ(kamala harris news) మోదీ భేటీకానున్నారు. బైడెన్​ను కలిసే ఒక రోజు ముందు.. సెప్టెంబర్​ 23న.. మోదీ-హ్యారిస్​ సమావేశం ఉండనుంది. ఇరువురి మధ్య ఇదే తొలి భేటీకానుంది.

"ఈ నెల 23న.. భారత ప్రధాని నరేంద్ర మోదీ- వైస్​ ప్రెసిడెంట్​ కమలా హ్యారిస్​ మధ్య భేటీ జరగనుంది."

-- శ్వేతసౌధం ప్రకటన.

మోదీ షెడ్యూల్​ ఇలా...

ఈ నెల 22న వాషింగ్టన్​కు చేరుకోనున్నారు మోదీ(modi america news). ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ షెడ్యూల్​ బయటకు వస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.

మోదీ వాషింగ్టన్​లో ఉండే సమయానికే.. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య సమావేశం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.

24సాయంత్రం వాషింగ్టన్​ నుంచి న్యూయర్క్​ వెళతారు ప్రధాని. ఐరాస జనరల్​ అసెంబ్లీలో కీలక ప్రశంగం చేయనున్నారు(modi un speech 2021).

రెండో ప్రయాణం..

కొవిడ్​ అనంతర కాలంలో మోదీ.. విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు మోదీ. అమెరికాలో చివరిసారిగా.. 2019లో పర్యటించారు మోదీ(modi tour to usa). మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏర్పాటు చేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- 'ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.