ETV Bharat / bharat

కార్ పార్కింగ్​ కోసం గొడవ- గన్​ షూటింగ్, మూక దాడిలో నలుగురు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:34 PM IST

Updated : Jan 15, 2024, 10:34 PM IST

bihar mob lynching over car parking
bihar mob lynching over car parking

Mob Lynching Over Car Parking In Bihar : కార్ పార్కింగ్​ విషయంలో జరిగిన గొడవ నలుగురి ప్రాణాలు బలిగొంది. బిహార్​లోని ఔరంగాబాద్​లో సోమవారం జరిగిందీ ఘటన.

Mob Lynching Over Car Parking In Bihar : కార్​ పార్కింగ్​పై తలెత్తిన వివాదంలో నలుగురు హత్యకు గురయ్యారు. బిహార్​లోని ఔరంగాబాద్​లో సోమవారం జరిగిందీ ఘటన. మృతుల్లో ఒకరు తుపాకీ కాల్పులు వల్ల చనిపోగా, మూకదాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ దుకాణం ముందు కార్​ నిలిపి ఉంచేందుకు అభ్యంతరం తెలపడం ఈ దారుణానికి కారణమైంది.

చిన్న గొడవగా మొదలు
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఔరంగాబాద్​లోని నవీనగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ దుకాణం ముందు ఓ కారు ఆగింది. అయితే, అక్కడ కార్ పార్క్ చేయడానికి వీలు లేదని ఆ దుకాణదారుడు వాహనంలోని వారికి చెప్పాడు. తక్షణమే అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. కారులోని నలుగురు ఇందుకు అభ్యంతరం తెలిపారు. దుకాణం యజమానికి, వారికి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. సహనం కోల్పోయిన వాహనదారుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అయితే గురి తప్పి దుకాణం యజమానికి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతడి పక్కనే ఉన్న వ్యక్తికి తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

తుపాకీ కాల్పుల్లో తమ వాడు మరణించడంపై చుట్టుపక్కల దుకాణదారులు, స్థానికులు తీవ్రంగా స్పందించారు. అందరూ కలిసి కార్​లో వచ్చిన నలుగురిపై దాడి చేశారు. ఈ మూక దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో గాయపడిన వారిని వకిల్ అన్సారీ, అజీత్ శర్మను ఔరంగాబాద్​లోని సర్దార్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వకిల్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అయితే అజీత్ శర్మ పరిస్థితి విషమంగా ఉందని, దీంతో గయాలోని ఆస్పత్రి సిఫారసు చేశారు. తుపాకీ కాల్పుల్లో మరణించిన వ్యక్తిని మహువరీ గ్రామానికి చెందిన రామ్ శరణ్​ చౌహాన్​గా గుర్తించారు. కార్​లో వచ్చి గొడవ పడిన నలుగురు ఝార్ఖండ్ పాలాము జిల్లాలోని హైదర్​నగర్​ వాసులని తేల్చారు.

Six People Killed In Old Factions : ఇద్దరి మధ్య వివాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు బలి.. ఏం జరిగింది?

మటన్​ బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లు - చితకబాదిన వెయిటర్లు ​

Last Updated :Jan 15, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.