ETV Bharat / bharat

భార్యపై అనుమానం.. గొంతు నులిమి హత్య.. శవాన్ని ముక్కలు చేసి..

author img

By

Published : Mar 23, 2023, 7:38 PM IST

man-murdered-his-wife
man-murdered-his-wife

బంగాల్​లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది.

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టాడు. ఈ ఘటన బంగాల్​ దక్షిణ 24పరగణాలు జిల్లాలోని బిష్ణుపుర్​ ప్రాంతంలో వెలుగు చూసింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ముర్షీదాబాద్​లో నివాసముంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న నిందితుడు అలీమ్​ షేక్​(35)కు మన్వార మండలానికి చెందిన ముంతాజ్ షేక్(35)​ అనే మహిళతో 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వివాహానంతరం అలీమ్​ అత్తామామలు బిష్ణుపుర్‌లోని చిట్‌భాగి ప్రాంతానికి నివాసం మార్చారు. అలీమ్ సర్దా గార్డెన్స్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ముంతాజ్ సమాలీ ప్రాంతంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసేది. రోజులాగే మంగళవారం ఉదయం పనికి వెళ్లేందుకు ముంతాజ్ తన భర్త అలీమ్​తో కలిసి బయలుదేరింది. ఆరోజు రాత్రైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అలీమ్ ఎప్పటిలాగే రాత్రి తన అత్తమామల ఇంటికి వచ్చాడు. అయితే బుధవారం ఉదయం వరకు ముంతాజ్​ కనిపించకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు అలీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే భార్య ముంతాజ్​ను హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు భార్యను హత్య చేసి ఆమెను ముక్కలుగా నరికాడు. అనంతరం దగ్గర్లోని ఓ చెరువు వద్ద వాటిని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. పాతిపెట్టిన చోటుకు హంతకుడు అలీమ్​ను తీసుకెళ్లి డెడ్​బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమ బిడ్డలాంటి దాన్ని అత్యంత కిరాతంగా చంపిన అలీమ్​ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అలీమ్​ను అరెస్టు చేశారు. కాగా, ఈ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అలీమ్​తో పాటు ఇంకెవరికైనా సంబంధం ఉన్నా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచార నిందితుడి దారుణ హత్య..
స్వీడన్​ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి శిక్ష అనుభవిస్తున్న నిందితుడు మహమ్మద్​ రాజా దిల్లీలో హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం సెంట్రల్​ దిల్లీలోని పవార్​గంజ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు రాజాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వీరిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరిలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రాజా దిల్లీలోని మండవాలిలో నివాసముంటున్న మహమ్మద్ రాజాగా గుర్తించారు పోలీసులు.

ఈ ఘటనపై పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అనుమానితులుగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుడు, క్షతగాత్రులు, నిందితులిద్దరు స్థానికంగా చెత్త సేకరించే పని చేస్తుంటారు. అలాగే వీరు డ్రగ్స్​కు కూడా బానిసలయ్యారని.. ఈ క్రమంలోనే వీరు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు మహ్మద్ రాజా అత్యాచారం కేసులో దోషిగా ఉన్నాడని.. కాగా ఇతడు ప్రస్తుతం పెరోల్​పై బయటకు వచ్చాడని డీసీపీ సంజయ్ కుమార్ సేన్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.