ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

author img

By

Published : Sep 10, 2022, 4:40 PM IST

man-booked-for-raping-class-2-student

ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఉత్తర్​ప్రదేశ్​ నగ్రాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు మద్యం విషయంలో గొడవ తలెత్తగా యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన ఝార్ఖండ్​ గఢ్వాలో జరిగింది. దేవుడికి పెట్టిన నైవేద్యం దొంగలించాడని ఓ బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు పూజారి. మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

ఝార్ఖండ్​ దుమ్కాలో తరహాలోనే గఢ్వాలో కూడా పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఘటన జరిగింది. శ్రీబంశీధర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చిత్తవిశ్రామ్​లో గ్రామంలో.. ఒక వృద్ధుడు యువకుడిని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి విషమించిన యువకుడు దీపక్​ సోనీని(37) గఢ్వాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది.
కసముద్దీన్​ అన్సారీ అనే వ్యక్తితో సోనీకి.. మద్యం విషయంలో గొడవ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు భయపడి.. ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ జిల్లా బాంగర్​మౌ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులకు భయపడి రాజేశ్​ అనే వ్యక్తి తన మెడను తానే కోసుకున్నాడు. గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రాజేశ్​, అతడి భార్య మధ్య గొడవ అయిందని.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని బంధువులు చెప్పారు. తనను అరెస్టు చేశారన్న భయంతోనే రాజేశ్​ ఇలా చేసినట్లు చెబుతున్నారు.

పాత శత్రుత్వంతో కత్తితో పొడిచి.. ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటన కేరళ కొచ్చి జిల్లా కలూర్​ సమీపంలో శనివారం ఉదయం జరిగింది. రెండు వర్గాల మధ్య పాత శత్రుత్వంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు.
గతంలో ఫేస్​బుక్​లో రెచ్చగొట్టే పోస్ట్​ పెట్టినందుకు కిరణ్​ ఆంటోనీ అనే వ్యక్తిని ప్రశ్నించడానికి.. అతడి ఇంటికి తన గ్రూప్​తో బయల్దేరాడు సజ్జన్​. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్రమవగా.. సజ్జన్​ చనిపోయాడు. ఆంటోనీ సహా పలువురికి గాయాలయ్యాయి. సజ్జన్​ హత్యతో ఆంటోనీని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

రెండో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం.. రెండో తరగతి చదివే ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు 25 ఏళ్ల వ్యక్తి. ఉత్తర్​ప్రదేశ్​ నగ్రాలో సెప్టెంబర్​ 5న ఈ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ప్రలోభపెట్టిన నిందితుడు.. తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

దివ్యాంగురాలిపై గ్యాంగ్​ రేప్​.. మహారాష్ట్ర జల్నాలో దివ్యాంగ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బద్నాపుర్​ తాలుకా దభాడీ గ్రామంలో ఆగస్టు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన పూజారి.. దేవుడికి పెట్టిన నైవేద్యం(బాదం పప్పులు) దొంగలించాడన్న కారణంతో.. 11 ఏళ్ల బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు ఓ ఆలయ అర్చకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లాలో జరిగింది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు జైన దేవాలయం పూజారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.

ఇవీ చూడండి : ఫుడ్​ డెలివరీ బాయ్​ మర్మాంగంపై కుక్క కాటు.. లిఫ్ట్​ నుంచి బయటకు వస్తుండగా..

దళిత బాలుడిపై దారుణం.. గణేశుడి​ విగ్రహాన్ని తాకాడని మూకదాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.