ETV Bharat / bharat

Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board టీటీడీ బోర్డు మెంబర్​గా దిల్లీ లిక్కర్‌ కేసు అప్రూవర్​ శరత్‌ చంద్రారెడ్డి

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 9:50 AM IST

Updated : Aug 26, 2023, 10:00 AM IST

Delhi Liquor Scam Sarath Chandra Reddy TTD Board Member
Delhi Liquor Scam Sarath Chandra Reddy TTD Board Member

Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board: దిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి.. అప్రూవర్‌గా మారిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డిని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో సీఎం జగన్‌ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యేను సభ్యుడిగా మరోమారు కొనసాగించింది. మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు సర్దుబాటు చేయలేక పోతున్నవారికి, రాజకీయ పునరావాసం కల్పిస్తూ మరికొందరికి.. అవకాశం కల్పించింది. బెంగళూరులో సీఎం జగన్‌ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యేను సభ్యుడిగా మరోమారు కొనసాగించింది.

Delhi Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్‌ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన పెనక శరత్‌ చంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వం చోటు కల్పించింది. వైసీపీలో దాదాపు నంబర్‌ 2గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కావడమే ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరులో సీఎం జగన్‌ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డిని సభ్యుడిగా మరోమారు కొనసాగించింది.

వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్తిగా శరత్‌చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది విజయసాయి రెడ్డి ప్రభావమే. శరత్‌ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు సైతం దక్కాయి. తితిదే ఛైర్మన్‌, ఈవో సహా తిరుమల తిరుపతిల్లోని కీలక పదవులను ఒక ప్రధాన సామాజికవర్గానికి ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా తితిదే పాలకమండలిలోని 24 మంది సభ్యులలో అయిదుగురు ఆ సామాజికవర్గానికి చెందిన వారే.

TTD New Governing Council: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

మంత్రిమండలిలోకి తీసుకోలేకపోయిన ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, సామినేని ఉదయభాను, ఎం.తిప్పేస్వామిలకు, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నవారిలో మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు వీర వెంకట సుధీర్‌కుమార్​లకు తితిదే బోర్డు సభ్యుల పదవులు దక్కాయి. తితిదే ఛైర్మన్‌ పదవి కోసం శిద్ధా రాఘవరావు ప్రయత్నించారు. అది ఇవ్వలేకపోతే తన కుమారుడికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కలిసి కోరారు. ఈ నేపథ్యంలో సుధీర్‌కు బోర్డు సభ్యత్వం ఇచ్చారు.

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుడైన ఆర్‌.వెంకట సుబ్బారెడ్డి, వైఎస్‌ కుటుంబానికి విధేయుడు, వైయస్‌ఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వెంట తిరిగే నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్ధవటం యానాదయ్యకూ తి.తి.దే. బోర్డులో అవకాశం కల్పించారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి గత డిసెంబరులో ముగిసినప్పటికీ ఆయనను ఆ పదవిలోనే కొనసాగిస్తున్నారు. గత పాలకమండలిలో సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌కు కొనసాగింపు ఇచ్చారు. ఆయన ఎంసీఐ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసింది.

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్​లో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన శరత్‌చంద్రారెడ్డి

TTD Board Members from Telangana: తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి భార్య గడ్డం సీతారెడ్డికి అదే విధంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రాంరెడ్డికి అవకాశమిచ్చారు. తమిళనాడు నుంచి బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి, కృష్ణమూర్తి వైద్యనాథన్‌, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌ని నియమించారు. కర్ణాటక నుంచి యలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి , హలియాల్‌ ఎమ్మెల్యే రఘునాథ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండేకి అవకాశమిచ్చారు. మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బొరా సౌరభ్‌ని నియమించారు.

దిల్లీ మద్యం కేసు.. శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబులకు 14 రోజుల కస్టడీ

Last Updated :Aug 26, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.