ETV Bharat / bharat

బ్లేడును మింగిన 11నెలల చిన్నారి.. 45 నిమిషాలపాటు శ్రమించి కాపాడిన వైద్యులు..

author img

By

Published : Jan 3, 2023, 9:59 PM IST

Updated : Jan 3, 2023, 10:09 PM IST

Kolkata hospital performs rare surgery
బ్లేడును మింగిన 11నెలల చిన్నారి

కోల్​కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. బ్లేడును మింగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11నెలల చిన్నారికి ఆపరేషన్​ చేసి ప్రాణాలు కాపాడారు.

కోల్​కతాలోని వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి 11 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడారు. దీప్​దాస్ అనే చిన్నారి బ్లేడును మింగేశాడు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహటిన అతడి తల్లి ఆస్పత్రికి తరలించింది. ఎన్​ఆర్​ఎస్​ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ వైద్యులు 45 నిమిషాల పాటు కష్టపడి ఆపరేషన్​ చేసి బ్లేడును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం..
ముర్షిదాబాద్​కు చెందిన ​11 నెలల దీప్​దాస్ అనే చిన్నారి గురువారం ఇంటి చుట్టు పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే తన తల్లి వెళ్లి చూడగా దీప్​దాస్​ కాలికి గాయమై రక్తం కారుతుంది. ఆ గాయాన్ని పరీక్షించగా కాలిలో చిన్న బ్లేడ్ ముక్క కనిపించింది. వెంటనే చిన్నారి బ్లేడ్​ మింగి ఉంటాడని భావించి అతడి తల్లి ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు చిన్నారికి ఎక్స్​రే తీయగా కడుపులో బ్లేడు ఉన్నట్లు తెలిసింది.

వెంటనే బహరంపుర్ మెడికల్ కాలేజీకి తీసుకు వెళ్లగా.. వారు కోల్‌కతాలోని ఎన్​ఆర్​ఎస్​ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చించగా.. శుక్రవారం ఉదయం వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆపరేషన్​ చేసి బ్లేడుని బయటకు తీసినట్లు డాక్టర్ నిరూప్ బిస్వాస్ తెలిపారు.

Last Updated :Jan 3, 2023, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.