Kerala Corona Cases: కేరళలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Oct 19, 2021, 7:22 PM IST

కేరళలో  కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Cases) మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 7,643 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 77 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేరళలో కరోనా రోజువారీ కేసులు(Kerala Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 7,643 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్​(Kerala Covid Cases News) కారణంగా మరో 77 మంది మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,59,434కు చేరింది. మరణాల సంఖ్య 27,002కు పెరిగింది. మరో 10,488 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,262కు పడిపోయింది.

కేరళలో గత 24 గంటల వ్యవధిలో 82,408 నమూనాలను పరీక్షించారు. త్రిస్సూర్​ జిల్లాలో అత్యధికంగా 1,107 మందికి కొత్తగా వైరస్​ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 963, ఎర్నాకులంలో 817 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

  • దేశ రాజధాని దిల్లీలో 36 కొవిడ్​(Delhi Covid Cases Today) కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా కొత్తగా ఎవరూ చనిపోలేదు.
  • కర్ణాటకలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. 399 మంది కోలుకోగా.. మరో 14 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 556 మందికి కరోనా సోకగా.. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.