ETV Bharat / bharat

Kashmir news: కశ్మీర్​లో ఎన్​కౌంటర్-​ పౌరుడు మృతి

author img

By

Published : Oct 24, 2021, 1:13 PM IST

Kashmir Encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో (Kashmir Encounter) ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మరో ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ పౌరుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

జమ్ముకశ్మీర్​లో ముష్కరవేట కొనసాగుతోంది. పూంచ్​, షోపియాన్, రాజౌరి​ జిల్లాల్లో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో షోపియాన్​ జిల్లాలోని బాబపుర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో(Kashmir Encounter) గుర్తు​తెలియని వ్యక్తి మరణించగా.. జౌన్​పుర్​లో ఓ పౌరుడు చనిపోయాడని అధికారులు తెలిపారు.

పూంచ్​ జిల్లాలోని సూరన్​కోట్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులు తెగపడ్డారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఇతన్ని లష్కరే తోయిబా ముష్కరుడిగా గుర్తించిన అధికారులు.. అరెస్ట్​ చేశారు. ముష్కర వేట కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'మహిళలూ! చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.