ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్స్​.. జైషే కమాండర్​ సహా నలుగురు ముష్కరులు హతం

author img

By

Published : Mar 12, 2022, 9:34 AM IST

Kashmir Encounter
Kashmir Encounter

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జైషే కమాండర్​ కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాది చిక్కినట్లు పేర్కొన్నారు.

Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్లు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018 నుంచి ఉగ్ర కార్యకలాపాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. పుల్వామా, గందర్‌బాల్‌, హంద్వారాలో ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ చెప్పారు.

పుల్వామాలో చేప్టటిన ఆపరేషన్‌లో కమాండర్​తో పాటు మరో ముష్కరుడిని మట్టుబెట్టినట్లు తెలిపారు. గంధర్‌బాల్, హంద్వారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరిని హతమార్చినట్లు వివరించారు. మరో ఉగ్రవాదని ప్రాణాలతో పట్టుకున్నట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.