ETV Bharat / bharat

ఇక్బాల్‌ మిర్చి ఆస్తులు స్వాధీనం: ఈడీ

author img

By

Published : Nov 19, 2020, 7:32 AM IST

Iqbal Mirchi's assets worth Rs 500 crore seized by ED in Mumbai
ఇక్బాల్‌ మిర్చి ఆస్తుల స్వాధీనం: ఈడీ

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ముఖ్య అనుచరుడైన ఇక్బాల్​ మిర్చి ఆస్తులను జప్తు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ముంబయిలో ఇక్బాల్​కు చెందిన రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.

మాఫియా నేత ఇక్బాల్‌ మిర్చికి చెందిన ముంబయిలోని రూ.500 కోట్ల విలువైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తెలిపింది. స్మగ్లింగ్‌, మాదకద్రవ్యాల సరఫరా, విదేశీమారక ద్రవ్య అక్రమాల నిరోధక చట్టాల కింద ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది ఈడీ.

ఇక్బాల్​కు సంబంధించిన వర్లి ప్రాంతంలోని మూడు భవనాల(స్థిరాస్తులు)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం అధికారులు. దావూద్‌ ఇబ్రహీంకు కుడిభుజంగా భావించే ఇక్బాల్‌ మిర్చి 2013లో లండన్‌లో చనిపోయాడు.

ఇదీ చదవండి: దావూద్​ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.