ETV Bharat / bharat

కుప్పకూలిన ఎయిర్​ఫోర్స్​ శిక్షణ విమానం

author img

By

Published : Oct 21, 2021, 11:22 AM IST

Updated : Oct 21, 2021, 12:03 PM IST

mp plane crash
మధ్యప్రదేశ్​లో విమాన ప్రమాదం

11:15 October 21

మధ్యప్రదేశ్​లో విమాన ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని భిండ్​లో వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్​క్రాఫ్ట్​ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.    

ఈ విమానం ఐఏఎఫ్​ మిరేజ్​-2000గా అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్​ఫోర్స్​ వెల్లడించింది. గ్వాలియర్​లోని మహారాజపుర ఎయిర్​బేస్​ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి పైలట్​ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది.  

ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వాయుసేన స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : మంచు పర్వతాల్లో 'అగ్నివర్షం'.. భారత్ యుద్ధ​ సన్నద్ధం!

Last Updated :Oct 21, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.