ETV Bharat / bharat

దేశంలో మరో 20,550 మందికి కరోనా

author img

By

Published : Dec 30, 2020, 9:44 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 20,550 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరో 286 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 26వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 95.99 శాతానికి చేరింది.

INDIA REPORTS 20,550 NEW COVID-19 POSITIVE CASES AND 286 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 20,550 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 20,550 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటీ 2లక్షల 44వేల 853కు పెరిగింది. వైరస్​ ధాటికి మరో 286 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 48వేల 439కి చేరింది.

ఇదీ చదవండి: దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ

రికవరీ రేటు ఇలా..

తాజాగా 26 వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 98లక్షల 34వేల 141కి చేరింది. 2లక్షల 62వేల 272 యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.99 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: మహమ్మారి నేర్పిన పాఠాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.