ETV Bharat / bharat

Covid updates: 2.11 లక్షల కేసులు.. 3,847 మరణాలు

author img

By

Published : May 27, 2021, 9:51 AM IST

దేశంలో కొత్తగా 2,11,298 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,847 మంది కొవిడ్​తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,15,235కు చేరింది.

india covid cases
కరోనా

దేశంలో కరోనా మరణాలు క్రితం రోజుతో పోల్చితే కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి మరో 3,847 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,11,298 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.

  • మొత్తం కేసులు: 2,73,69,093
  • మొత్తం మరణాలు: 3,15,235
  • కోలుకున్నవారు: 2,46,33,951
  • యాక్టివ్ కేసులు: 24,19,907

33.69 కోట్ల పరీక్షలు..

దేశవ్యాప్తంగా బుధవారం 21,57,857 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 33,69,69,352కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్​​

దేశంలో ఇప్పటివరకు 20,26,95,874 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ​ పేర్కొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.