ETV Bharat / bharat

కాంగ్రెస్​కు గుడ్​బై.. భాజపాలో మాత్రం చేరను: అమరీందర్

author img

By

Published : Sep 30, 2021, 1:49 PM IST

Updated : Sep 30, 2021, 5:24 PM IST

I WILL LEAVE CONGRESS: Amarinder singh
కాంగ్రెస్​కు అమరీందర్​ గుడ్​బై

13:45 September 30

కాంగ్రెస్​కు భారీ షాక్​.. మాజీ ముఖ్యమంత్రి గుడ్​బై!

పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీకి భారీ షాక్​ తగిలింది. ఊహించినట్లుగానే పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​. అయితే భాజపాలో చేరట్లేదని, కాంగ్రెస్​ను మాత్రం కచ్చితంగా వీడతానని స్పష్టం చేశారు. 

పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూతో విభేదాల కారణంగా.. సెప్టెంబర్​ 18న అమరీందర్​ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత.. చరణ్​జిత్​ సింగ్​ చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు సిద్ధూ. ఈ నేపథ్యంలోనే.. పార్టీలో ఉండనని కెప్టెన్​ చెప్పారు​.

అది మంచిది కాదు..

తాను భాజపాలో చేరనని, అయితే కాంగ్రెస్​లో కొనసాగే ఉద్దేశం కూడా లేదని గురువారం స్పష్టం చేశారు అమరీందర్​ సింగ్​​. తనకు తీవ్ర అవమానం జరిగిందని, తనపై కాంగ్రెస్​ విశ్వాసం ఉంచలేదని ఆరోపించారు. పంజాబ్​ ప్రయోజనాల దృష్ట్యా ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకా ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.

''కాంగ్రెస్​లో నాకు అవమానం ఎదురైంది. నేను దీనిని తీసుకోలేను. నా సిద్ధాంతాలు, సూత్రాలకు విరుద్దంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీలో నేను ఇక కొనసాగలేను.''

           - అమరీందర్​ సింగ్​, మాజీ సీఎం

కాంగ్రెస్​.. సీనియర్లను పక్కనపెడుతోందని, ఇది పార్టీకి ఏ మాత్రం మంచిదికాదని అన్నారు అమరీందర్. అందుకే రోజురోజుకూ దిగజారుతోందని విమర్శించారు. సీనియర్​ నేత కపిల్​ సిబల్​ ఇంటిపైనా.. కాంగ్రెస్​ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. సిబల్​ అభిప్రాయం.. అధిష్ఠానానికి రుచించలేదని తెలిపారు. 

వరుస భేటీల తర్వాత..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. భాజపాలో చేరతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన దిల్లీ పర్యటన చేపట్టటం అందుకు బలం చేకూర్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో బుధవారం భేటీ అయ్యారు అమరీందర్​. అయితే.. రైతుల సమస్య సహా రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన గురించి మాట్లాడినట్లు పేర్కొన్నారు.

గురువారం జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్​తోనూ భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంతో.. పంజాబ్​లో పాక్​ సమస్యలు సృష్టించే అవకాశముందని, దానిపైనే చర్చించినట్లు వెల్లడించారు. 

కాంగ్రెస్​ విఫలయత్నం..  

భాజాపా నేతలతో వరుస భేటీ నేపథ్యంలో కెప్టెన్​ను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ అధిష్ఠానం విశ్వప్రయత్నాలు చేసింది. భాజపాలో చేరకుండా.. ఉండేలా అమరీందర్​ను శాంతిపజేసేందుకు సీనియర్​ నేతలు అంబికా సోని, కమల్​నాథ్​లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అయితే ఇవేమీ ఫలించలేదు. కాంగ్రెస్​ నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు అమరీందర్. 

Last Updated :Sep 30, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.