ETV Bharat / bharat

Gufran Encounter : యూపీలో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. వాంటెడ్​ క్రిమినల్‌ హతం

author img

By

Published : Jun 27, 2023, 11:11 AM IST

Updated : Jun 27, 2023, 12:53 PM IST

Gufran Encounter Killings By Police
Gufran Encounter Killings By Police

Encounter In Uttar Pradesh : 13 కేసులున్న వాంటెడ్ నేరస్థుడు ఉత్తర్​ప్రదేశ్ పోలీసుల ఎన్​కౌంటర్​లో మృతిచెందాడు. నేరస్థుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగినట్లు కౌశాంబీ జిల్లా ఎస్పీ బ్రిజేశ్​ కుమార్​ శ్రీవాస్తవ తెలిపారు.

Gufran Encounter Killings By Police : ఉత్తర్​ప్రదేశ్​లో మళ్లీ గన్​ పేలింది. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ నేరస్థుడు.. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఘటన కౌశాంబీ జిల్లాలోని మంఝన్​పుర్​ సమీపంలోని షుగర్​ మిల్లు వద్ద మంగళవారం తెల్లవారుజామును 5 గంటల సమయంలో జరిగింది. ఈ మేరకు ఎస్​పీ బ్రిజేశ్​ కుమార్​ శ్రీవాస్తవ వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్​గఢ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్​నగర్​కు చెందిన వ్యక్తి ​ గుఫ్రాన్‌. ఇతడు కొన్ని ముఠాలతో కలిసి ప్రతాప్​గఢ్​, కౌశాంబీ, ప్రయాగ్​రాజ్​, సుల్తాన్​పుర్​ తదితర జిల్లాల్లో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతాప్‌గఢ్‌లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దొంగతనం చేశాడు. 2022లో సుల్తాన్‌పుర్‌లోని ఓ పెట్రోల్ పంపులో పట్టపగలే దోపిడీకి పాల్పడ్డాడు. ప్రతాప్​గఢ్​లోని రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

దాదాపు 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న గుఫ్రాన్‌పై.. ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు రూ.లక్ష, సుల్తాన్‌పుర్‌ పోలీసులు రూ.25వేల రివార్డు ప్రకటించారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే, ఓ ముఠాతో మరో నేరానికి నిందితుడు సిద్ధమవుతున్నట్లు లఖ్​నవూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ​ (ఎస్​టీఎఫ్​)కు సమాచారం అందింది. దీంతో మంఝన్​పుర్​​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కడిపుర్​ సమీపంలో బైక్​పై తన సహచరుడితో వెళ్తున్న నిందితుడిని.. మంగళవారం తెల్లవారుజామును 5 గంటల ఎస్​టీఎఫ్​ చుట్టుముట్టింది.

అనంతరం నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు.. ఎదురుకాల్పులు జరిపడం వల్ల.. తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏఎస్​పీ సమర్​ బహదూర్​, ఫోరెన్సిక్​ బృందం ఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి ఓ పిస్తోల్​, ఒక బైక్​, 17 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Atiq Ahmed Son Death : గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్‌లో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. ఏప్రిల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతీక్​​ అహ్మద్​ కుమారుడు అసద్ హతమయ్యాడు. ఆ తర్వాత రెండ్రోజులకే అతీక్ అహ్మద్​, అతడి సోదరుడు అష్రఫ్​ అహ్మద్​ దారుణ హత్యకు గురయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా.. వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీక్​ ఆహ్మద్‌, అష్రఫ్‌ అహ్మద్‌పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు.

Atiq Ahmed Death : మొదట అతీక్ అహ్మద్‌ కణితిపై గురిపెట్టి కాల్చిన నిందితులు.. వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అతీక్ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కిందపడిపోయారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతీక్ అహ్మద్‌.. అష్రఫ్‌ అహ్మద్‌ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఈ కాల్పుల దృశ్యాలు జర్నలిస్టుల మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి.
Uttar Pradesh Encounter List : 2017లో యోగి ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 10వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరగగా.. 185 మంది క్రిమినల్స్‌ను మట్టుబెట్టారు.

Last Updated :Jun 27, 2023, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.