ETV Bharat / bharat

ఎయిమ్స్​లో చేరిన నిర్మలా సీతారామన్​.. వైరల్ ఫీవర్ లక్షణాలు!

author img

By

Published : Dec 26, 2022, 1:03 PM IST

Updated : Dec 26, 2022, 6:27 PM IST

finance minister nirmala sitharaman
finance minister nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. కడుపులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్​తో ఆమె ఎయిమ్స్​కు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63)​ దిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రిలో చేరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో చేరారని తెలిసింది. ఆమెకు వైరల్ జ్వరం వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు ఆమెలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మంత్రి కోలుకుంటున్నారని స్పష్టం చేశాయి.

అంతకుముందు.. కడుపులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్​తో ఆమె ఎయిమ్స్​కు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం సాధారణ వైద్య పరీక్షలు సైతం చేశారని పేర్కొన్నాయి. నిర్మలా సీతారామన్​ ఏటా రెండు సార్లు మెడికల్ చెక్​అప్ చేయించుకుంటారని, అందులో భాగంగానే సోమవారం ఎయిమ్స్​కు వెళ్లారని ఆయా వర్గాలు స్పష్టం చేశాయి.

Last Updated :Dec 26, 2022, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.