ETV Bharat / bharat

షోపియాన్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Oct 11, 2021, 8:34 PM IST

Updated : Oct 12, 2021, 6:49 AM IST

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

Encounter
జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. షోపియాన్​ ప్రాంతంలో నక్కి ఉన్న ముగ్గురు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హతమైన వారిలో ఒకరిని గందర్‌బల్‌కు చెందిన ముక్తార్ షాగా గుర్తించారు. బిహార్​కు చెందిన వీరేంద్ర పాశవాన్​ అనే వ్యక్తిని చంపిన తరువాత వీరు షోపియాన్​కు మకాం మార్చినట్లు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఖేరిపొరా పోషియాన్​ ప్రాంతంలో రెండో ఆపరేషన్​ చేపట్టిన భద్రతా దళాలు ఉగ్రవాదులవైపు దూసుకెళ్లాయి. గత 24 గంటల్లో ఇది మూడో ఎన్​కౌంటర్​ కావడం గమనార్హం.

ఇదీ చూడండి: కశ్మీర్​లో చేదుగతం.. పునరావృతం..

Last Updated :Oct 12, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.