ETV Bharat / bharat

ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు.. ఎలక్ట్రిక్​​ బైక్​ దగ్ధం

author img

By

Published : Mar 16, 2022, 5:35 PM IST

electric bike catches fire while charging
దగ్ధమైన బైక్​

Electric bike catches fire while charging: ఛార్జింగ్​ చేస్తుండగా ఎలక్ట్రిక్​ ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఆ పక్కనే ఉన్న ఓ మంచం సైతం మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది.

Electric bike catches fire while charging: దేశంలో పెట్రోల్​ రేట్లు ఆకాశాన్నంటుతున్న క్రమంలో విద్యుత్​ వాహనాలకు డిమాండ్​ పెరిగింది. ఎలక్ట్రిక్​ ద్విచక్రవాహనాల నుంచి కార్లు, బస్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వాటిని ఛార్జింగ్​ చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగటం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ డిపోలో ఓ ఎలక్ట్రిక్​ బస్సు ఛార్జింగ్​ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది.

electric bike catches fire while charging
మంటల్లో దగ్ధమైన ఎలక్ట్రిక్​ బైక్​

దగ్ధమైన బైక్​..

శివమొగ్గ జిల్లా భద్రావతి తాలుకలోని నిందిగొండి గ్రామంలో ఛార్జింగ్​ పెట్టిన ఓ ఎలక్ట్రిక్​ బైక్​ మంటలు చెలరేగి కాలిబూడిదైంది. గ్రామానికి చెందిన మల్లికార్జున్​ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని కొబ్బరితోటలో రాత్రి ఛార్జింగ్​ పెట్టారు. ఓ గంట తర్వాత బైక్​లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు మల్లికార్జున్​ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జ్వాలల్లో పూర్తిగా దగ్ధమైంది. ఆ పక్కనే ఉన్న ఓ మంచం కూడా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్‌ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.