ETV Bharat / bharat

'సువేందు.. తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు'

author img

By

Published : Nov 28, 2020, 6:54 PM IST

Doors still open for talks with Suvendu Adhikari: TMC
'సువేందుతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి'

సువేందు అధికారితో చర్చలకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ సౌగతా రాయ్​. పార్టీ అధినాయకత్వంతో జరిగే ఆ చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగాల్​ కేబినెట్​ మంత్రి పదవిని వీడిన సువేందు అధికారితో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. సువేందు అసమ్మతి పట్ల ఆయనతో పార్టీ అధినాయకత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలో జరిగే ఆ చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

" సువేందుతో చర్చించడానికి మేమింకా సిద్ధంగానే ఉన్నాం. పార్టీ నాయకత్వానికీ, ఆయనకు మధ్య చర్చలు తప్పక జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. సువేందు తల్లి అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు ఇంకా కొంచెం ఎదురు చూడాల్సి ఉంటుంది."

-- సౌగతా రాయ్​, తృణమూల్ ఎంపీ.

కొంతకాలంగా పార్టీ వ్యవస్థాగత విషయాలపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు సువేందు అధికారి. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఆయన.. కేబినెట్​ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చూడండి:దీదీకి షాక్- మంత్రి పదవికి సువేందు రాజీనామా

ఇదీ చూడండి:'భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎంపీలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.