ETV Bharat / bharat

నగరంలో మెట్రో రైలు పనులు.. ఇళ్లల్లో పగుళ్లు.. జనం పరుగో పరుగు!

author img

By

Published : Oct 14, 2022, 10:15 AM IST

Kolkata: Residents flee as 10 buildings developed crack allegedly due to Metro Rail work
Kolkata: Residents flee as 10 buildings developed crack allegedly due to Metro Rail work

కోల్​కతాలో జరుగుతున్న మెట్రో రైలు పనుల కారణంగా ఇళ్లల్లో భారీగా పగళ్లు ఏర్పడాయి. భయాందోళనకు గురైన స్థానికులు రోడ్లు మీదకు పరుగులు తీశారు.

Kolkata Metro Works : బంగాల్​లోని కోల్​కతాలోని మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. బౌబజార్​ ప్రాంతంలో ఉన్న పది ఇళ్లల్లో శుక్రవారం ఉదయం భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన నివాసితులు.. ప్రాణభయంతో సామాన్లు తీసుకుని బయటకు పరుగులు తీశారు. అయితే తమ కష్టాలకు అధికారులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

cracks-in-houses because of Kolkata Metro Works
రోడ్ల మీద ప్రజలు

సమాచారం తెలుసుకున్న పోలీసు బలగాలు.. పెద్ద ఎత్తున ఘటనాస్థలిలో మోహరించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు. 2019లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడడం వల్ల తమ ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు స్థానికులు.

ఇవీ చదవండి: బస్సు సీటు కింద 100 కిలోల వెండి.. నడుము బెల్ట్​లో 16 కేజీల బంగారం

ఆన్‌లైన్లో విడుదలయ్యే సినిమాలపై కమిటీ ఎలా వేయగలం?: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.