ETV Bharat / bharat

పొత్తుపై గందరగోళం- లాలూ అలా.. కాంగ్రెస్​ ఇలా...

author img

By

Published : Oct 27, 2021, 7:51 PM IST

Confusion prevails over Congress-RJD tie-up in Bihar
పొత్తుపై గందరగోళం.. లాలూ అలా- కాంగ్రెస్​ ఇలా!

ఉపఎన్నికల ముందు బిహార్​లో కాంగ్రెస్​- ఆర్జేడీ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో (Sonia gandhi news) ఫోన్​లో మాట్లాడినట్లు చెప్పారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్ (Lalu yadav news)​. అయితే.. లాలూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు ఇద్దరి మధ్య సంభాషణ జరగలేదని ఆరోపించారు రాష్ట్ర ఏఐసీసీ బాధ్యులు భక్త్​ చరణ్​ దాస్​.

రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్ (Lalu-Sonia phone conversation)​.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్​లో మాట్లాడినట్లు చెప్పారు. భాజపాను ఎదుర్కొనేందుకు.. ఒకే రకమైన భావజాలాలున్న పార్టీలను ఏకం చేయాలని, దీనికి సోనియానే (Sonia gandhi news) నేతృత్వం వహించాలని కోరినట్లు (Lalu yadav news) పేర్కొన్నారు.

బిహార్​లో అక్టోబర్​ 30న ఉపఎన్నికలు జరగనున్న తారాపుర్​, కుశేశ్వర్​ ఆస్థాన్​ నియోజకవర్గాల్లో ప్రచారానికి బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవన్నీ అసత్యాలే..

అయితే.. లాలూ(Lalu yadav news) చెప్పినవి అన్నీ అసత్యాలేనని, సోనియాతో ఎలాంటి సంభాషణ జరగలేదని ఆరోపించారు రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్​ భక్త్​ చరణ్​ దాస్​. అది జరిగి ఉంటే తనకు సమాచారం అందేదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్​- ఆర్జేడీ పొత్తు అంశం తెరపైకి వచ్చింది. విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చిన దాస్​.. ఉపఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే లాలూ ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి సయోధ్య(Lalu-Sonia phone conversation) కుదరలేదని చెప్పారు.

ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తారాపుర్​లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కుశ్వేశ్వర్​లో గతేడాది 6 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని అన్నారు.

''సంకీర్ణ ధర్మానికి ఆర్జేడీ తూట్లు పొడిచింది. ఆ పార్టీతో పొత్తులు ఉండవు. 40 లోక్​సభ స్థానాల్లోనూ మేం పోటీచేస్తాం. 2024 తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. కాంగ్రెస్​ బరిలో ఉందని తెలిసి కూడా కుశ్వేశ్వర్​ ఆస్థాన్​లో ఆర్జేడీ పోటీ చేయడం నచ్చలేదు.''

- భక్త్​ చరణ్​ దాస్​

2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆర్జేడీ మహాకూటమిగా బరిలోకి దిగాయి. అయితే.. ఎన్​డీఏ విజయం సాధించింది. ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. భాజపా- జేడీయూ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్​ కొన్ని చోట్ల మాత్రమే నెగ్గింది.

ఇవీ చూడండి: తేజస్వీ వల్లే అర్జేడీ ఇలా ఉంది - లాలూ

'కాంగ్రెస్​తో కలిసి పోటీ చేస్తే డిపాజిట్​ గల్లంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.