ETV Bharat / bharat

ఆంజనేయస్వామికి ముస్లింల పూజలు.. హిందువులతో కలిసి రథాన్ని లాగి...

author img

By

Published : Jul 13, 2022, 12:17 PM IST

Updated : Jul 13, 2022, 12:52 PM IST

ఆంజనేయ స్వామి రథోత్సవంలో ముస్లింలు పాల్గొని మతసామరస్యాన్ని చాటారు. హనుమాన్​కు పూజలు నిర్వహించి హిందూ సోదరులతో కలిసి రథాన్ని లాగారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

మతసామరస్యం
మతసామరస్యం

రథోత్సవంలో పాల్గొన్న ముస్లింలు

హిందువులు జరుపుకొనే ఆంజనేయస్వామి ఉత్సవాల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటారు కొందరు ముస్లింలు. ఉత్సవంలో భాగంగా పూజలు నిర్వహించి హిందువులతో కలిసి రథాన్ని లాగారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహల్లి ప్రాంతంలో జరిగింది. ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య పలు అంశాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

d
రథోత్సవంలో పాల్గొన్న ముస్లింలు

అయితే, ఇలా అక్కడి ఆంజనేయ రథోత్సవంలో ముస్లింలు పాల్గొనడం అనేది తొలిసారి కాదు. ఎన్నో ఏళ్లుగా ఇరు వర్గాలు కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. హిందువులతో కలిసి ఇస్లాం మతస్థులు పూజలు నిర్వహించడమే కాక రథోత్సవంలో పాల్గొని ఉత్సవాలు వైభవంగా జరిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏటా జరుపుకున్నట్టే ఈసారి కూడా హిందూ-ముస్లింలు కలిసి ఈ ఉత్సవాలు జరుపుకొన్నారు.

d
రథం వద్ద ముస్లింలు

బక్రీద్​ సందర్భంగా రాజస్థాన్​లోని జైపుర్​లో కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. హిందూ మతానికి చెందిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ముస్లింలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను చేశారు. 'రామ్​ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి : హిందూ బాలిక గుండె దానం.. ముస్లిం యువకుడికి కొత్త జీవితం

Last Updated : Jul 13, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.