ETV Bharat / bharat

హిందువుకు ముస్లింల అంత్యక్రియలు.. బక్రీద్ రోజు వెల్లివిరిసిన మతసామరస్యం

author img

By

Published : Jul 11, 2022, 12:10 PM IST

muslim did rituals of hindhu
అంతిమ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు

బక్రీద్​ పర్వదినాన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన వ్యక్తి మరణించగా.. ముస్లింలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన రాజస్థాన్​లోని జైపుర్​లో జరిగింది.

హిందువుకు అంతిమ సంస్కారాలు చేసిన ముస్లింలు.. బక్రీద్​ రోజే ఘటన

రాజస్థాన్​లోని జైపుర్​ మతసామరస్యానికి వేదికైంది. హిందూ మతానికి చెందిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ముస్లింలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను చేశారు. 'రామ్​ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్​ పర్వదినం రోజునే ఈ ఘటన జరగింది.

muslim did rituals of hindhu
అంతిమ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు

జైపుర్​ సంజయ్​ నగర్​ బస్తీకి చెందిన సెన్సార్​పాల్ సింగ్ తన్వార్​ శనివారం మరణించాడు. అంతిమసంస్కారాలు నిర్వహించడానికి సరిపోయేంత జనం లేకపోవడం వల్ల వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఆదివారం బక్రీద్​ సందర్భంగా బస్తీ సమీపంలోని నూరానీ మసీదు వద్దకు ముస్లింలు ప్రార్థనల కోసం చేరుకున్నారు. పాల్​సింగ్ మరణ విషయం తెలుసుకున్న వీరు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు కాలినడకన తీసుకెళ్లి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

muslim did rituals of hindhu
అంతిమ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.