ETV Bharat / bharat

దంతెవాడలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

author img

By

Published : Oct 31, 2021, 5:07 PM IST

ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒక్కరోజే 14 మంది నక్సల్స్​.. జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 2017లో సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై దాడి చేసి 25 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనలో వీరంతా నిందితులుగా ఉన్నారు.

NAXALS
మావోయిస్టులు

ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా 2017లో సురేందర్‌గఢ్​లోని భద్రతా సిబ్బందిపై దాడి ఘటనలో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అప్పటి ఘటనలో 25 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. '14 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. వీరిలో కీలక సభ్యుడైన సన్నా మార్కం (21) ఉన్నాడని' దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు సైతం ఉందన్నారు. సుక్మా జిల్లా బుర్కపల్​లో 2017లో సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై జరిగిన ఆకస్మిక దాడిలో మార్కం పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇతర మిలీషియా సభ్యులు సైతం అడవుల్లో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్ల ధ్వంసం, పేలుడు పదార్థాలు అమర్చడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు పంచిపెడుతుంటారని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారులు హామీఇచ్చారు.

గతేడాది జూన్‌లో పోలీసులు ప్రారంభించిన 'లోన్ వర్రాటు'లో భాగంగా ఇప్పటివరకు 454 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వీరిలో 117 మందిపై నగదు రివార్డు ఉన్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా 'పోలీసు అధికారులు చేపట్టిన పునరావాస కార్యక్రమం 'లోన్ వర్రాటు' తమను ఆకర్షించినట్లు' మావోయిస్టులు పేర్కొన్నారు. అంతేగాక.. 'కాలం చెల్లిన మావోయిస్టు భావజాలంతో నిరాశ చెందినట్లు' వెల్లడించారు.

నక్సల్స్ లొంగుబాటు కోసం దంతెవాడ పోలీసులు గత కొంతకాలంగా.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.