ETV Bharat / bharat

Case on Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు షాక్‌.. ఆ వివాదంలో కేసు నమోదుకు కోర్టు ఆదేశం

author img

By

Published : Aug 1, 2023, 9:34 AM IST

Srinivas Goud
Srinivas Goud

Case Against Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆయనపై కేసు నమోదు చేయాలని.. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రితో పాటు బాధ్యులైన ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులపై కేసులు నమోదు చేయాలని తెలిపింది.

Nampally Court to Order Register Case Against Srinivas Goud : ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. మంత్రితో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్‌కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్‌, కేంద్ర ఎన్నికల అధికారి సంజయ్‌కుమార్‌, మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, వెంకటేశ్‌ గౌడ్, నోటరీ అడ్వకేట్ రాజేంద్రప్రసాద్, దానం సుధాకర్‌లపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. మరోవైపు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతుండగా.. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన కోర్టు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

మరోవైపు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ మరోసారి విచారణ చేపట్టారు. శ్రీనివాస్‌గౌడ్‌ 2018 నవంబరు 19న దాఖలు చేసిన.. అఫిడవిట్‌ ఆధారంగా విచారణ చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించి విచారించాల్సిన సాక్షుల వివరాలు, సాక్ష్యాలను సమర్పించాలని పిటిషనర్‌ సీహెచ్‌ రాఘవేంద్రరాజును ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది.

అంతకుముందు పిటిషనర్‌ సీహెచ్‌ రాఘవేంద్రరాజు తరఫు న్యాయవాది వి.వెంకటమయూర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. నామినేషన్‌ సమయంలో శ్రీనివాస్‌గౌడ్‌ తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం సమర్పించారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.

దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ స్పందిస్తూ మెరుగైన అఫిడవిట్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. అందులోని వివరాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఏ అఫిడవిట్‌ తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని.. అఫిడవిట్‌ మార్చడం కూడా చెల్లదని న్యాయస్థానానికి వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సాక్ష్యాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. కోర్టు విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించరాదని ఇరుపక్షాలకు ఆదేశాలు జారీ చేశారు.

Raghanandan Rao on Srinivas Goud Case : మరోవైపు తప్పుడు ఎన్నికల అఫిడవిట్‌ సమర్పించి.. కోర్టు కేసు నమోదు చేయాలన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని.. వెంటనే ప్రభుత్వం బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రులను.. కేబినేట్ నుంచి తప్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను చర్చించేందుకు కనీసం 30 రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జనం ఇబ్బందులు చర్చించే వేదిక అసెంబ్లీ నిర్వహణ విషయంలో.. కేసీఆర్ సర్కార్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ చుట్టూ అమ్మిన భూముల వివరాలు, వచ్చిన ఆదాయంతో ఏం చేశారో చెప్పాలన్నారు. చిన్నపాటి చినుకుకే భాగ్యనగరం రోడ్లపై ట్రాఫిక్‌ వెతలకు కారణమెంటో చెప్పాలని రఘనందన్‌రావు ప్రశ్నించారు.

ఇవీచదవండి : Pil in Allotment on Land to BRS : బీఆర్​ఎస్​కు కోకాపేటలో భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్

Telangana High Court : 'అదీ ఒక రకమైన భూ కబ్జానే'.. తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.