ETV Bharat / bharat

83 తేజస్​ ఫైటర్​ జెట్ల తయారీకి భారత్​ సిద్ధం

author img

By

Published : Jan 13, 2021, 6:23 PM IST

Updated : Jan 13, 2021, 7:58 PM IST

భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ​ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48,000 కోట్లతో తేజస్​ ఫైటర్​ జెట్​లు సమకూర్చాలని నిర్ణయించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు రూ.48,000 కోట్లతో 83 తేజస్​ ఫైటర్​ జెట్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్ సింగ్ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్​ ఫైటర్​ జెట్​లో సరికొత్త సాంకేతికతను ఉపయోగించే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మొదటి స్వదేశీ మెషీన్ గన్​ అభివృద్ధి

Last Updated : Jan 13, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.