బిహార్ రాజధాని పట్నాలోని పరాస్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా చేసి ఓ వృద్ధురాలి ప్రాణాలను కాపాడారు. పిత్తాశయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె కాలేయంలో 60 శాతానికి పైగా భాగాన్ని తొలగించారు.
మోతిహారీ బిహార్కు చెందిన రజియా ఖాతూన్కు కొన్నాళ్ల క్రితం పిత్తాశయ క్యాన్సర్ సోకిందని పరాస్ ఆసుపత్రి వైద్యుడు నితిన్ కుమార్ తెలిపారు. దీంతో ఆమె కాలేయం కుడి వైపు రక్త సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.
"రజియా ఖతూన్కు చికిత్స చేయడానికి క్లిష్ట సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆమెకు కామెర్ల లక్షణాలు ఉండడం వల్ల చికిత్స చేయడం చాలా కష్టమైంది. అందుకే మొదట కామెర్లు తగ్గడానికి చికిత్స అందించాం. ఆ తర్వాత బయెప్సీ పరీక్ష ద్వారా క్యాన్సర్ స్థాయిని గుర్తించాం. నాలుగు విడతల్లో కీమోథెరపీ చేశాం. అది పూర్తయ్యాక ఆరు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి 60 శాతానికిపైగా కాలేయ భాగాన్ని తొలగించి ప్రాణాలు కాపాడాం."
- నితిన్కుమార్, వైద్యుడు
రజియా ఖతూన్ త్వరగా కోలుకుంటున్నారని, తొలగించిన కాలేయ భాగాన్ని తిరిగి అతి త్వరలోనే పొందుతారని వైద్యులు భావిస్తున్నారు. బిహార్లో కాలేయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
ఇదీ చదవండి: మెట్రోస్టేషన్ గ్రిల్లో చిక్కుకున్న బాలిక.. అంతలోనే..!