ETV Bharat / bharat

నేడు సరిహద్దుల్లో వంతెనలను ప్రారంభించనున్న రాజ్​నాథ్​

author img

By

Published : Sep 24, 2020, 4:34 AM IST

దేశ సరిహద్దు ప్రాంతాల్లోని 43 వంతెనలను గురువారం జాతికి అంకితమివ్వనున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వీటిలో 7బ్రిడ్జీలు లద్దాఖ్​కు చెందినవే. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ వంతెనలు అందుబాటులోకి రావడం భారత సైన్యానికి కలిసొచ్చే విషయం.

Rajnath to dedicate 43 bridges in seven states and UTs on Thursday
సరిహద్దులో 43 వంతెనలను ప్రారంభించనున్న రాజ్​నాథ్​

జమ్ముకశ్మీర్​​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​లోని సరిహద్దు ప్రాంతాలలో నిర్మించిన 43 వంతెనలను.. గురువారం జాతికి అంకితమివ్వనున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భద్రతా దళాలు, ఆయుధాల తరలింపునకు ఈ వంతెనలు సహాయపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

"ఆన్​లైన్​ కార్యక్రమంలో భాగంగా.. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ) నిర్మించిన వంతెనలను రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ గురువారం ప్రారంభిస్తారు."

--- రక్షణశాఖ వర్గాలు.

లద్దాఖ్​లో 7...

అయితే ఈ 43లో 7 వంతెనలు లద్దాఖ్​లో నిర్మించినవే కావడం విశేషం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో ఈ బ్రిడ్జీలు అందుబాటులోకి రావడం భారత్​కు కలిసివచ్చే విషయం.

మిగిలిన వాటిల్లో.. 10 వంతెనలు జమ్ముకశ్మీర్​, రెండు హిమాచల్​ప్రదేశ్​, 8 ఉత్తరాఖండ్​, 8 అరుణాచల్​ప్రదేశ్​, నాలుగు సిక్కిం, నాలుగు పంజాబ్​లో ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్​ ప్రదేశ్​ తావాంగ్​లోని నిచిఫు టన్నెల్​కు రాజ్​నాథ్​ శంకుస్థాపన చేస్తారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- సరిహద్దులో భారత్‌ వ్యూహాలు.. అన్నివైపులా బిగింపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.