ETV Bharat / bharat

'మోదీ ప్రభుత్వం విదేశీ సంబంధాలను దెబ్బతీసింది'

author img

By

Published : Sep 23, 2020, 1:02 PM IST

Modi govt has 'destroyed' web of relationships with countries: Rahul
మోదీ ప్రభుత్వంలో విదేశీ సంబంధాలు దెబ్బతిన్నాయి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఏళ్ల తరబడి తమపార్టీ నిర్మించిన విదేశీ సంబంధాలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ.. అధికార భాజపా ప్రభుత్వంపై మరోసారి విమర్శలకు ఎక్కుపెట్టారు. తమ పార్టీ దశాబ్దాలుగా నిర్మించిన విదేశీ సంబంధాలను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు . పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు రాహుల్​.

భారత్​తో బంగ్లాదేశ్​ సంబంధాలు బలహీనపడటం వల్ల.. చైనాతో ఆ దేశం బంధాలు బలపడ్డాయని తెలిపే ఓ నివేదికను ఆధారంగా చూపిస్తూ ట్విట్టర్​ వేదికగా భాజపాపై విమర్శల దాడి చేశారు రాహుల్.

Rahul Gandhi Twitter
రాహుల్​ గాంధీ ట్వీట్​

"ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్​ నిర్మించి, ఏర్పరచుకున్న విదేశీ సంబంధాలను మోదీ నాశనం చేశారు. స్నేహితులు లేని పరిసరాల్లో నివసించడం ప్రమాదకరం."

-రాహుల్​ గాంధీ ట్వీట్​

పొరుగుదేశాలతో సంబంధాలు బలహీనపడ్డాయని ఆరోపించిన కాంగ్రెస్​.. మోదీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ విధానం దెబ్బతిందని విమర్శించింది. అయితే.. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది అధికార భాజపా. భారత్​తో ఇతర దేశాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొంది.

ఇదీ చదవండి: 'సెక్స్ వర్కర్లకు నగదు బదిలీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.