ETV Bharat / bharat

దేశంలో 70 లక్షలకు చేరువైన కరోనా కేసులు

author img

By

Published : Oct 10, 2020, 10:08 AM IST

దేశవ్యాప్తంగా మరో 73 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది. మరో 926 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాలు లక్షా ఏడు వేలకు చేరాయి. మరోవైపు కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 8.58 కోట్లకు సమీపించింది.

corona cases in india
దేశంలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కొత్తగా 73,272 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 926మంది మరణించారు.

కేంద్ర వైద్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. మరణాల సంఖ్య 1,07,416కు పెరిగింది. కరోనా నుంచి 59,88,823 మంది బాధితులు కోలుకున్నారు.

నిర్ధరణ పరీక్షలు

దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షల సామర్థ్యం పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 11,64018 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం పరీక్షల సంఖ్య 8,57,98,698కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.