ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాల్లో అయిుదు రోజుల పాటు భారీ వర్షాలు!

author img

By

Published : Jul 13, 2020, 5:43 AM IST

ఈశాన్య భారత్​లో రానున్న అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితంగా తూర్పు బిహార్​ పరిసర ప్రాంతాల్లో తుపానుకు అవకాశాలున్నాయని అంచనా వేసింది.

Heavy to very heavy rainfall likely over Northeast India in next 5 days
ఈశాన్య రాష్ట్రాల్లో అయిుదు రోజుల పాటు భారీ వర్షాలు!

దేశంలో రాబోయే అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావారణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలు సహా.. బంగాల్, సిక్కిం, బిహార్​కు ఆనుకొని ఉన్న తూర్పు ఉత్తర్​ప్రదేశ్​లో కుండపోత వర్షాలు కురవనున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితంగా తూర్పు బిహార్​, దాని పరిసర ప్రాంతాల్లో తుపాను సంభవించవచ్చని అంచనా వేసింది ఐఎండీ.

జులై 13న బంగాల్​, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఆ తరువాత క్రమేపీ తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది. అనంతరం మహారాష్ట్రలోని ముంబయి, థానే, రాయ్​ఘడ్​ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని.. ఈ వారంలో ఒకటి రెండుసార్లు ఆకాశం మేఘావృతమయ్యే అవకాశమున్నట్లు ఐఎండీ పేర్కొంది.

అక్కడ మొదలు​..

పంజాబ్​, హరియాణా, దిల్లీ, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లలో రెండురోజులుగా వర్షాలు కురిశాయని చెప్పింది ఐఎండీ. పంజాబ్​లోని మూడు చోట్ల సుమారు 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ సీనియర్​ అధికారి తెలిపారు.

కర్ణాటకలోనూ..

అయితే ఈ వర్షాల వల్ల కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలు సహా.. ఉడుపిలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరిత్య పర్యవేక్షణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి: ఝార్ఖండ్​లో పిడుగులు పడి ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.