ETV Bharat / bharat

'16,002 పరీక్షల్లో 2 శాతం పాజిటివ్​​ కేసులు'

author img

By

Published : Apr 10, 2020, 5:02 PM IST

దేశంలో సామాజిక విస్తరణ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. గత 24 గంటల్లో 16,002మందికి​ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపిన ఆరోగ్యశాఖ.. కేవలం 2 శాతం మందికే వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యిందని వివరించింది.

health-ministry-briefing-on-corona-virus-outbreak
'16,002 పరీక్షల్లో 0.02శాతం పాజిటివ్​​ కేసులు'

దేశంలో 24 గంటల వ్యవధిలో 16,002 కరోనా పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 2శాతం మాత్రమే పాజిటివ్​ కేసులు ఉన్నాయని ఆ శాఖ సంయుక్త ప్రధాన కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు. దేశంలో సామాజిక విస్తరణ లేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

146 ప్రభుత్వ, 67 ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నట్టు వివరించారు లవ్​ అగర్వాల్​. రెండు నెలల్లో 49వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్లిచ్చినట్టు పేర్కొన్నారు.

తగినంత నిల్వలు..

హైడ్రాక్సీ క్లోరోక్విన్​ కోసం వివిధ దేశాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు. దేశంలో కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్​ మాత్రల అవసరం ఉందని... కానీ మొత్తంగా 3.28కోట్ల మాత్రలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

దేశంలో ఇప్పటివరకు 6,412మంది వైరస్​ బారినపడ్డారు. ప్రస్తుతం 5709 యాక్టివ్​ కేసులున్నాయి. మొత్తం 199మంది ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.