ETV Bharat / bharat

దిల్లీలో కరోనా ఉద్ధృతిపై సీఎం అఖిలపక్ష భేటీ

author img

By

Published : Nov 19, 2020, 5:35 AM IST

COVID: Delhi records highest single day death count; Kejriwal calls all-party meeting to discuss coronavirus situation
దిల్లీలో కరోనా పరిస్థితులపై సీఎం అఖిలపక్ష భేటీ

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. దిల్లీలో మాత్రం వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారి కేసుల సంఖ్యలో అధికభాగం దేశ రాజధానిలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

దిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో కొవిడ్​ పరిస్థితులపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. వైరస్​పై అవగాహన కల్పించడంలో ఆయా నియోజకవర్గ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారం కోరనున్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశంలో దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్ గుప్తా, పీసీసీ చీఫ్ అనిల్ చౌదరితో పాటు ఇతరులు పాల్గొంటారని సమాచారం.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వైరస్​ బాధితులకు 660 ఐసీయూ పడకలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. అంతేకాకుండా రైల్వేతో కలిసి మరో 800 పడకలను అందించనున్నట్టు సమాచారం. అధునాతన వైద్య సదుపాయాలతో.. 45మంది వైద్యులు, పారామిలటరీ దళాల నుంచి 160 మంది డాక్టర్లు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు.

ఇదీ దిల్లీ పరిస్థితి..

అక్టోబర్ 28 నుంచి దిల్లీలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజులోనే 7,486 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 5లక్షల 3వేల 84కు ఎగబాకింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో 131మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8వేలకు సమీపించింది.

ఇదీ చదవండి: కరోనా పంజా- దిల్లీలో 5లక్షలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.