ETV Bharat / bharat

'వందే భారత్' ద్వారా రూ.2556 కోట్ల ఆదాయం

author img

By

Published : Sep 16, 2020, 6:35 PM IST

వందే భారత్​ మిషన్​ ద్వారా ఆగస్టు 31 నాటికి ఎయిర్ ఇండియా రూ.2555.6 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి.

Air India earned over Rs 2550 crore revenue from Vande Bharat flights till Aug 31: Hardeep Singh Puri
వందే భారత్ మిషన్ ద్వారా రూ.2556 కోట్ల ఆదాయం

వందే భారత్​ మిషన్​ ద్వారా ఆగస్టు 31 నాటికి ఎయిర్ ఇండియా రూ.2556.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి వెల్లడించారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు మే 6న 'వందే భారత్​ మిషన్​'ను ప్రారంభించింది కేంద్రం.

అందులో భాగంగా 2020 ఆగస్టు 31 నాటికి మొత్తం 4,505 ఎయిర్ ఇండియా విమానాలు సేవలందించాయని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు హర్దీప్​. విదేశాల్లో చిక్కుకున్న వారిలో మొత్తం 11లక్షల మంది భారతీయులు స్వదేశానికి రాగా.. ఎయిర్ ఇండియా సేవల్ని 4లక్షల మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మరో 1.9లక్షల మందిని ఈ విమానాల ద్వారా విదేశాలకు తరలించినట్టు వివరించారు హర్దీప్​.

ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.